వారధి కష్టాలు
చిన్నపాటి వర్షం కురిసిన జిల్లాలో అక్కడక్కడ కల్వర్టులు దాటి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఓ మోస్తరు వాన కురిస్తే వంతెనల మీదుగా వరద పారుతుంది. దీంతో
వంతెనల నిర్మాణ పనులు ప్రారంభించని వైనం
న్యూస్టుడే, వనపర్తి
మదనాపురం - ఆత్మకూరు మధ్య పొంగిపొర్లుతున్న వాగు (పాత)
చిన్నపాటి వర్షం కురిసిన జిల్లాలో అక్కడక్కడ కల్వర్టులు దాటి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఓ మోస్తరు వాన కురిస్తే వంతెనల మీదుగా వరద పారుతుంది. దీంతో వరద ఉద్ధృతి తగ్గే వరకు వంతెనకు ఇరువైపులా ఉన్న వారు ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నా.. పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో వంతెనలు, కాజ్వేలు, కల్వర్టులు నిర్మించేందుకు నిధులు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే వానాకాలంలోగా పూర్తి చేస్తే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగయ్యేందుకు అవకాశం ఉంది.
నిధులు ఇలా..
ఖిల్లాగణపురం మండలం అప్పారెడ్డిపల్లి - ఆముదంబండతండా మధ్య వంతెన నిర్మాణానికి రూ.1.20 కోట్లు, గోపాల్పేట మండలం గుడ్డిమోతవాగు వంతెనకు రూ.1.28 కోట్లు, వనపర్తి మండలం చాకలిబండ వాగుపై వంతెనకు రూ.1.80 కోట్లు, వనపర్తి - పెబ్బేరు రహదారిలో వంతెనకు రూ.6.80 కోట్లు, పెబ్బేరు - యాపర్ల వంతెనకు రూ.కోటి, నాటవెల్లి - అప్పరాలకు రూ.3.90 కోట్లు, వనపర్తి - పెబ్బేరు మధ్య కల్వర్టు కోసం రూ.1.70 కోట్లు, ఇదే దారిలో కాజ్వే కోసం రూ.1.70 కోట్లు, వనపర్తి - కొల్లాపూర్ రహదారిలో కేతేపల్లి వద్ద కాజ్వే నిర్మాణానికి రూ.3 కోట్లు, ఖిల్లాగణపురం - కొత్తమొల్గర వద్ద వంతెనకు రూ.2 కోట్లు, వెంకటాపూర్ - సూగూరు రోడ్డు డ్యామ్ కోసం రూ.3 కోట్లు, గోపాల్పేట మండలం బుద్దారం గండి వద్ద వంతెన నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున చొప్పున మంత్రి నిరంజన్రెడ్డి గతేడాది నిధులు మంజూరు చేశారు.
ఏళ్లుగా జాప్యమే..
శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేట - బునియాదిపురం మధ్య వంతెన నిర్మాణానికి 2007లో రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయగా.. అధికారులు పనులు ప్రారంభించి పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. దీనిపై నాణ్యత శాఖ అధికారులు నాణతపై అభ్యంతర పెట్టి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ అతిగతి లేదు. తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించినా.. వాన వచ్చినప్పుడల్లా నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వరద ఉద్ధృతి ఎక్కువైతే సూగూరు మీదుగా 11 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా జానంపేట రైతుల పొలాలు ఎక్కువగా వాగు అవతలే ఉన్నాయి. దీంతో వారు వ్యవసాయ కూలీలను తరలించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మదనాపురం-ఆత్మకూరు మధ్య ఉన్న ఊకచెట్టు వాగు వరద ఉద్ధృతి పెరిగితే వంతెనపై నీరు పారుతూ ఏటా వానాకాలంలో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.9.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. అధికారులు పనుల ప్రారంభానికి టెండర్లు సైతం నిర్వహించిన పనులు ప్రారంభించలేదు. దీనికి సమీపంలోనే రైల్వే గేటు ఉండటంతో వంతెన పొడవు నిర్మాణంపై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి పెద్దమందడి మండల కేంద్రం 10 కి.మీ. దూరంలో ఉంది. రాజనగరం దాటగానే కల్వర్టులు ఉన్నాయి. చిన్న కల్వర్టులే అయినా.. వాన కురిసిందంటే చాలు వరద నీరు కల్వర్టుల మీదుగా పారుతూ రాకపోకలు పూర్తిగా స్తంభింపజేస్తోంది.
దూరాభారం తగ్గించాలి
మాది పెద్దమందడి. ప్రతి పనికి జిల్లా కేంద్రానికి పోవాల్సిందే. వైద్యం, నిత్యావసర వస్తువులు, విత్తనాలు, ఎరువులు తదితర వాటి కోసం నిత్యం వనపర్తికి పోతుంటాం. అయితే వానాకాలం వచ్చిందంటే చాలు భయమేస్తుంది. రాజనగరం వద్ద ఉన్న కల్వర్టుల మీదుగా వరద నీరు పారుతుండటంతో 25 కి.మీ. తిరిగి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. వంతెన నిర్మించి దూరాభారం తగ్గించాలి.
- చెన్నయ్య, పెద్దమందడి
టెండర్లు పిలిచాం
జిల్లాలో వానలు వచ్చినప్పుడు వరద నీరు పారే వంతెనల స్థానంలో కొత్తగా వంతెనలు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి వచ్చే వానాకాలం లోగా పనులు పూర్తయ్యేలా చూస్తాం.
- దానయ్య, ర.భ.శాఖ డీఈ, వనపర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల