ఏడాదిలోవడివడిగావ్యాక్సిన్
కరోనా వ్యాక్సినేషన్ చేపట్టి ఏడాది కాగా ఉమ్మడి జిల్లాలో మొదటి డోసు వందశాతం.. రెండో డోసు 70 శాతం పూర్తయింది.. 2021 జనవరి 16న ప్రారంభమైన టీకాల కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది.. ఫ్రంట్లైన్ వారియర్స్..
మొదటి డోసు వంద శాతం పూర్తి
న్యూస్టుడే, పాలమూరు, అయిజ
అయిజ : విద్యార్థికి టీకా ఇస్తున్న వైద్య సిబ్బంది
కరోనా వ్యాక్సినేషన్ చేపట్టి ఏడాది కాగా ఉమ్మడి జిల్లాలో మొదటి డోసు వందశాతం.. రెండో డోసు 70 శాతం పూర్తయింది.. 2021 జనవరి 16న ప్రారంభమైన టీకాల కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది.. ఫ్రంట్లైన్ వారియర్స్.. వివిధ రంగాలకు చెందినవారు.. దీర్ఘకాలిక రోగులు.. వయసుల వారీగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ నిర్వహించగా వైద్య సిబ్బంది సమష్టిగా సాగి విజయవంతం చేశారు.. ప్రస్తుతం రెండో డోసుతోపాటు బూస్టర్ డోసులు.. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకాల ప్రక్రియ సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత డోసుకు 26,20,891 మంది అర్హులు కాగా 26,63,893 మందికి టీకాలను వేశారు. అయిదు జిల్లాలు కూడా వందశాతం లక్ష్యాలను చేరుకున్నాయి. రెండో డోసు 18,52,345 మందికి అందించగా, 1,15,482 మంది 15- 18 ఏళ్ల లోపు కొవిడ్ టీకాలను తీసుకున్నారు.
* రాష్ట్ర వ్యాప్తంగా 15-18 ఏళ్ల లోపు వయస్సున్న వారికి టీకాలను అందించడంలో మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వనపర్తి రెండో స్థానంలో ఉండగా, జోగులాంబ గద్వాల జిల్లా అయిదో స్థానంలో, నారాయణపేట జిల్లా 14వ స్థానంలో ఉంది.
* రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే చివరి స్థానంలో నాగర్కర్నూల్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 15 - 18 ఏళ్ల లోపు వయసున్న వారిలో కేవలం 29 శాతం మందికే టీకాలను అందించారు. అందువల్లనే 33వ స్థానంలో జిల్లా నిలిచింది.
ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం
గతేడాది జనవరిలో ప్రారంభించిన కొవిడ్ టీకాను మొదటి ప్రాధాన్యంగా ఆరోగ్య కార్యకర్తలకు అందించారు. ఆ తరవాత పోలీసులు, పురపాలిక, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించగా, తరవాత ప్రభుత్వ ఉద్యోగులు, చౌకధరల దుకాణాలు, మార్కెట్లు, రైతు బజార్లు, హోటళ్లు, పాత్రికేయులు.. ఇతర ప్రజా సంబంధమైన కార్యకలాపాలు నిర్వర్తించే వారికి టీకాలను ఇచ్చారు. అనంతరం 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, తరవాత 45 ఏళ్లు పైబడిన వారికి కొన్ని నెలల తరువాత 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలను అందించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు టీకాలను ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.
త్వరగా పూర్తి చేస్తాం : టీకా ప్రక్రియ వందశాతం పూర్తి చేయడానికి కృషి చేయనున్నట్లు మహబూబ్నగర్ డీఎంహెచ్వో డా.కృష్ణ తెలిపారు. అర్హత కలిగిన వారికి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేస్తామని, అందుకోసం తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో టీకాలను అందించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని చెప్పారు. రెండో డోసు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని, విద్యార్థులకు కూడా మొదటి డోసు ఇస్తున్నామని హెల్త్కేర్ వర్కర్స్కు, ఫ్రంట్ లైన్ వారియర్స్కు బూస్టర్ డోసులను అందిస్తున్నామన్నారు.
అర్హులందరికీ పంపిణీ
జిల్లాలో అర్హులైన వారందరికీ టీకా పంపిణీ చేస్తాం. మొదటి విడత నుంచి బూస్టర్ డోసు వరకు టీకా అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. టీకా నిల్వలు జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో టీకా కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాటి టీకాను తెప్పిస్తున్నాం.
- చందూనాయక్, ఇన్ఛార్జి డీఎంహెచ్వో
మొదటి డోసు పూర్తి అయింది : 101.60 శాతం
రెండో డోసు : 70.20 శాతం
15 నుంచి 18 ఏళ్ల లోపు వారు : 62.80 శాతం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ మద్యం పట్టివేత
[ 25-04-2024]
రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత, కేసు నమోదు
[ 25-04-2024]
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?