పల్లె ప్రగతితోనే ఆదర్శ గ్రామాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితోనే పల్లెలు విరాజిల్లుతున్నందున కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. చిత్రంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ పట్టణం, న్యూస్టుడే : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితోనే పల్లెలు విరాజిల్లుతున్నందున కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హైదరాబాదు ఎర్రమంజిల్లో ఉమ్మడి జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై మంత్రులు నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. గ్రామ కార్యదర్శులకు జియోట్యాగింగ్ పెట్టామని, ఉమ్మడి జిల్లాలోని కార్యదర్శులు, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల వినియోగం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుకు సాగాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. కొత్త రహదారులు, మురుగు కాలువల పనులు చేసుకోవాలన్నారు. ఉపాధిహామీ నిధుల వినియోగంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పంచాయతీ భవనాలు, కాలువల పూడిక పనులూ ఉపాధి నిధులతో చేపట్టాలన్నారు. మార్చిలోగా ఎక్కువ ఉపాధి పనులు చేయాలని ఆదేశించారు.
* ఆబ్కారీ, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కోయిలసాగర్ నుంచి తాగునీటి సరఫరాకు కేటాయించాలన్నారు. మన్యంకొండ దేవాలయం వద్ద తాగునీటి ట్యాంకు నిర్మించామని, వృథా నీరు చెరువుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగులో ఉన్న వివిధ పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలన్నారు. ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్పర్సన్లు ప్రతిపాదిత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
* సమీక్షలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పీవీ వాణీదేవి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాల్రాజు, మహేశ్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జైపాల్యాదవ్, హర్షవర్ధన్రెడ్డి, క్రాంతికిరణ్తోపాటు పీఆర్ కమిషనర్ శరత్, ఈఎన్సీ సంజీవరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, జిల్లాకు చెందిన ఎస్ఈలు, ఈఈలు, డీఆర్డీవోలు, డీపీవోలు పాల్గొన్నారు.
* వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ కింద కాలువల పూడికతీత, కల్వకుర్తి ఎత్తిపోతల పంపుహౌస్ నీటి సరఫరాను పునరుద్ధరించేలా చూడాలన్నారు. గ్రామీణ నీటి సరఫరాలో ఏజెన్సీల్లో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య పెంచి సమస్యలను పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణంలో దెబ్బతిన్న సీసీదారులకు మరమ్మతులు చేయాలన్నారు. లేదంటే పంచాయతీలకు ఈ బాధ్యత అప్పగించాలని సూచించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠథామాలను అనుకున్నంతగా వినియోగంలోకి రావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ దారులు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్తు సమస్య, తాగునీటి సరఫరాను ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా సీఏం ఆదేశాలతో చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో వనపర్తి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే