కరోనా కాలడ్డు
గతేడాది కరోనా మహమ్మారితో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈసారి కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్ష తరగతులకు ఉపక్రమించింది. ఉపాధ్యాయులు సైతం ఆ సమయానికి సిలబస్
40 శాతమైనా పూర్తికాని పదో తరగతి సిలబస్
న్యూస్టుడే, మహబూబ్నగర్ అర్బన్
గతేడాది కరోనా మహమ్మారితో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈసారి కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యక్ష తరగతులకు ఉపక్రమించింది. ఉపాధ్యాయులు సైతం ఆ సమయానికి సిలబస్ పూర్తి చేయడానికి యత్నించినా సాధ్యం కాలేదు. మరోసారి కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో బడులను మళ్లీ ఈ నెలాఖరు వరకు మూసేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
విద్యా సంవత్సరం కాలమానిని ప్రకారం.. 2021 సెప్టెంబరు 1న ప్రత్యక్ష తరగతుల ప్రారంభం, 10 జనవరి 2022 వరకు సిలబస్ పూర్తి. ప్రీ ఫైనల్, సాధన పరీక్షలు, ఇతరత్రా ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. వార్షిక పరీక్షలు మార్చి- ఏప్రిల్లో నిర్వహించే అవకాశమున్నట్లు కాలమానిని రూపొందించారు. దాని ప్రకారం కాకుండా అదనంగా సెలవులు ఇచ్చేశారు. మధ్యలో ఆటంకాలు ఎదురవటంతో సిలబస్ పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలో 40 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సిలబస్ కొంత తగ్గించారు. ఆలస్యంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడంతో ఆ మేరకు కుదించారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్, సంక్రాంతి సెలవులు అదనంగా 15 రోజులు పెంచడంతో కొంతమేర సమయం కోల్పోవాల్సి వచ్చింది.
షాబజార్ పాఠశాలలో విద్యార్థులకు పాఠాల బోధన
కొవిడ్-19 విజృంభణతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని విద్యావేత్తలు అంటున్నారు. ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాలవారు చదువులో వెనకబడుతున్నారు. కరోనా వచ్చినప్పట్నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలే నిర్వహించడం లేదు. ఈసారైనా జరపాలని ప్రభుత్వం ముందుకు సాగుతున్నా.. కరోనా అడ్డుపడుతూనే ఉంది. విద్యా సంవత్సర కాలమానిని ప్రకారం సిలబస్ పూర్తి చేయాల్సిన గడువు ఈనెల 10తో ముగిసింది. ఇప్పటివరకు 40 శాతమైనా పూర్తి కాలేదు. సిలబస్ మిగలడంతో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. సెప్టెంబరులో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినా.. పాఠశాలకు వచ్చేందుకు 10- 15 రోజులు పట్టింది. ఆ తరవాత అక్టోబరులో దసరా సెలవులు, ఎఫ్ఏ1 పరీక్షలు.. నవంబరులో కాస్త పరవాలేదనిపించినా.. డిసెంబరులో ఉపాధ్యాయుల బదిలీల గొడవ, జనవరిలో సంక్రాంతి సెలవులు.. ప్రస్తుతం పొడిగింపు.. దీంతో గ్రామీణ ప్రాంతాల పిల్లలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఆన్లైన్ తరగతులు సైతం వారు సక్రమంగా వినలేదు. ఫిబ్రవరి మినహాయిస్తే మళ్లీ మార్చిలో ఒంటిపూట బడులే.. ఇలా అన్నీ ఆటంకాలతో ఈ విద్యా సంవత్సరాన్ని అధిగమించేందుకు తీవ్ర ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పక్కా ప్రణాళికతో ముందుకు.. : ఈ ఏడాది జనవరి చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలని సూచించాం. సెలవుల పొడిగింపుతో కొంత ఇబ్బంది ఎదురైనా.. విద్యార్థుల ఆరోగ్యమే మాకు ప్రధానం. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
- ఉషారాణి, ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి, మహబూబ్నగర్
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నాం..
పాఠాలు చెబుతున్నా చదువుకునేందుకు సమయం లేక ఒత్తిడి పెరిగింది. వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్నాం. నిత్యం హోంవర్క్తోపాటు ప్రత్యేక పాఠాలపై దృష్టి సారించాం.
- సాయిప్రియ, పదో తరగతి, మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల, మహబూబ్నగర్
భారం పెరిగింది..
పాఠాలను త్వరగా చెబుతూనే వార్షిక పరీక్షలకు ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. మాకు కష్టంగానే ఉంది. ముందుగా ప్రత్యక్ష తరగతులు ఉంటే బాగుండేది. బడుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఒక్కసారిగా భారం పడింది.
- బి.అశ్విని, పదో తరగతి, జడ్పీహెచ్ఎస్ కౌకుంట్ల
ప్రయత్నించాం...
సిలబస్ సకాలంలో పూర్తి చేయడానికి యత్నించాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ రోజు ఎంతమేర చెప్పాలో అలాగే చేశాం. ఒత్తిడికి గురవకుండా వార్షిక పరీక్షలు రాసేలా పదో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. పాఠాలు బోధించడంతోపాటు అత్యంత ప్రధానమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
- అబ్దుల్హక్, కాంప్లెక్స్ హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ కౌకుంట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!