logo

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మహ్మదాబాద్‌ మండలంలోని ఆముదాలగడ్డతండాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన సంతోష్‌ (20) హైదరాబాదులో భవన 

Published : 18 Jan 2022 01:47 IST

ఆముదాలగడ్డతండా (గండీడ్‌) : ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మహ్మదాబాద్‌ మండలంలోని ఆముదాలగడ్డతండాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన సంతోష్‌ (20) హైదరాబాదులో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తుండేది. సంక్రాంతికి తండాకొచ్చిన ఆయన.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదు. పోలీసులను వివరణ కోరగా.. ఎలాంటి సమాచారం రాలేదన్నారు.

బల్మూరు : భార్య ఇంటికి రాలేదని భర్త చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి మండలంలోని మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రేణయ్య కథనం ప్రకారం.. జంగ శ్రీశైలం (26) భార్య ఈనెల 13న బల్మూరులో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం బల్మూరుకు వెళ్లిన శ్రీశైలం ఇంటికి రావాలని భార్యను కోరాడు.  పండుగ తర్వాత వస్తానని చెప్పడంతో వెనుదిరిగాడు. మైలారం వచ్చిన శ్రీశైలం మనస్తాపంతో ఇంటి పక్కనున్న చెట్టుకు రాత్రి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యలు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి  అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీశైలానికి కుమారుడు ఉన్నాడు. సోమవారం తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యలకు అప్పగించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని