నిరుపేదల కల్యాణం..దళారుల వైభోగం
కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన తండ్రి మరుసటి రోజే హఠాన్మరణం చెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకొంది.
రెవెన్యూ అధికారుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్
* ధన్వాడ మండలం తోలగుట్ట తండాకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలల కిందట కుమార్తె వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకొని ఓ యువ నాయకుడిని ఆశ్రయించారు. అతను రెవెన్యూ అధికారుల పేరుతో అప్పుడప్పుడు కలిపి ఆమె నుంచి మొత్తం రూ.40 వేల వరకు వసూలు చేశాడు. ఇటీవలే రూ.1,00116 చెక్కు వచ్చింది. దళారికి ఇచ్చింది పోగా రూ.60116 మాత్రమే మిగిలింది.
* అదే తండాకు చెందిన మరో కుటుంబంలో ఎనిమిది నెలల కిందట యువతి వివాహం చేశారు. నిరక్షరాస్యులైన వీరికి కల్యాణలక్ష్మి డబ్బు ఎలా పొందాలో తెలియక ఓ దళారీని నమ్ముకున్నారు. అతను రెవెన్యూ అధికారుల పేరుతో రూ.35 వేలు వసూలు చేశాడు. ఇటీవల లబ్ధిదారుల చేతికి చెక్కు వచ్చింది. దళారికి ఇచ్చిన డబ్బులు పోను రూ.65,116 మాత్రమే మిగిలాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
* ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లి గ్రామానికి చెందిన ఓ మైనార్టీ కుటుంబం తమ కుమార్తె వివాహం చేశారు. షాదీముబారక్ పథకం కోసం సమీపంలోని ఓ గ్రామ దళారీని ఆశ్రయించారు. రూ.25 వేలు ఖర్చు అవుతాయని చెప్పిన దళారీకి ముందస్తుగా రూ.పదివేలు అందజేశారు. చెక్కు వచ్చాక మిగతా రూ.15 వేలు ఇస్తారన్న నమ్మకం ఏమిటంటూ అప్పు ఇచ్చినట్లు కాగితం రాయించుకున్నాడు. ఇటీవల షాదీముబారక్ చెక్కు రాగా.. ఆ దళారీ అప్పు కాగితం తీయడంతో మైనార్టీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధన్వాడలోని తమ బంధువులతో మొరపెట్టుకున్నారు. చివరికి స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర పంచాయతీ నిర్వహించి అప్పు కాగితాన్ని చించి వేసినట్లు సమాచారం.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ధన్వాడ మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో దళారుల భోజ్యమే అగ్రభాగం అవుతోంది. జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకొంటున్న దళారులు దరఖాస్తు చేయడం మొదలు చెక్కు చేతికి వచ్చేవరకు వివిధ సందర్భాల్లో రెవెన్యూ అధికారులు పేరు చెప్పి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. పథకం ద్వారా అందే మొత్తంలో సుమారు 40 శాతం వరకు దండుకొంటున్నారు. ఇటీవల మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సందర్భంగా దళారీల లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి.
తహసీల్దారు దృష్టికి అక్రమాలు..
ధన్వాడలో ఈ నెల మొదటి వారం చెక్కులు పంపిణీ చేసిన రోజు రాంకిష్టాయపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ కుటుంబం నుంచి ఓ దళారీ అప్పు పత్రం రాయించుకున్న విషయం వెలుగులోకి రావడంతో పలువురు లబ్ధిదారులు తాము కూడా దళారులకు ఎంతెంత ఇచ్చింది బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని వారం కిందట స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
రూ. లక్షలు దండుకుంటున్నారు..
ధన్వాడ మండల కేంద్రంలో ఈ నెల 5న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సుమారు 145 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. వీటి విలువ రూ.1,45,16,820. వీటిలో కనీసం రూ.30 లక్షల వరకు దళారులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో దరఖాస్తు చేయడానికి రానివారు, నిరక్షరాస్యులు ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి అధికారి వరకు మామూళ్లు ఇవ్వాల్సిందేనంటూ లబ్ధిదారులకు చెబుతూ అక్రమ దందాకు తెర తీస్తున్నారు. గత్యంతరం లేక పలువురు తమ వద్ద డబ్బులేకున్నా అప్పుచేసి ఇస్తుండగా.. మరికొందరు దళారులకే అప్పు పత్రం రాసి ఇస్తుండటం గమనార్హం.
ఫిర్యాదు చేస్తే చర్యలు..
దళారులు డబ్బులు వసూలు చేసినట్లు ఒకటి రెండు కేసులు నా దృష్టికి కూడా వచ్చాయి. డబ్బు ఇచ్చినవారు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకొని సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తాం. తీసుకున్న డబ్బు రికవరీ చేయిస్తాం.
- బాలచందర్రావు, తహసీˆల్దారు, ధన్వాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్