logo

మంత్రి హరీశ్‌రావు పర్యటనకు ఏర్పాట్లు

ఆసుపత్రి ప్రారంభంతో మండల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ అన్నారు. సోమవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా

Published : 18 Jan 2022 01:47 IST

ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌

కోయిలకొండ, న్యూస్‌టుడే : ఆసుపత్రి ప్రారంభంతో మండల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ అన్నారు. సోమవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎలాంటి పొరపాట్లకు తావ్వికుండా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల్లో అందమైన మొక్కలను నాటాలన్నారు. రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని మంగళవారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో శశికాంత్‌, ఎంపీడీవో జయరాం, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఏఈ శేఖర్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని