logo

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. బోరవెల్లి గ్రామానికి చెందిన కురువ కురుమన్న కుమారుడు మధుకుమార్‌(19) చెన్నకేశవస్వామి జాతర సందర్భంగా సోమవారం

Published : 19 Jan 2022 05:05 IST

మధుకుమార్‌

మానవపాడు, న్యూస్‌టుడే : విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. బోరవెల్లి గ్రామానికి చెందిన కురువ కురుమన్న కుమారుడు మధుకుమార్‌(19) చెన్నకేశవస్వామి జాతర సందర్భంగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధుకుమార్‌తోపాటు అతడి స్నేహితులంతా కలిసి గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి వద్ద పాటలు పెట్టుకొని డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మధుకుమార్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. మధుకుమార్‌ వనపర్తి జిల్లాలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అలంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణోత్తర పరీక్ష పూర్తవగానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి కురుమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని