కాలువలో దూకి యువతి, వివాహితుడి గల్లంతు!
వనపర్తి జిల్లా రేవెల్లి మండలం గౌరీదేవిపల్లి సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధి గుడిపల్లి జలాశయం కాలువలో ఓ యువతీ, వివాహితుడు దూకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జలాశయం ఒడ్డున వారికి సంబంధించి పాదరక్షలు,
ప్రేమను అంగీకరించలేదని చరవాణిలో సందేశం
గల్లంతైనట్లుగా భావిస్తున్న నరేశ్
రేవల్లి, కల్వకుర్తి పట్టణం, న్యూస్టుడే : వనపర్తి జిల్లా రేవెల్లి మండలం గౌరీదేవిపల్లి సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధి గుడిపల్లి జలాశయం కాలువలో ఓ యువతీ, వివాహితుడు దూకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జలాశయం ఒడ్డున వారికి సంబంధించి పాదరక్షలు, చరవాణి ఉండటం, చరవాణిలో తాము చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాయడంతో పోలీసులు కాలువలో గాలింపులు చర్యలు చేపట్టారు. చరవాణిలో ఉన్న వివరాల ప్రకారం పోలీసులు ఆ యువతీ కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యార్థిని (17)గా, వివాహితుడు నరేశ్ (25) నాగర్కర్నూల్కు చెందినవాడుగా భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విద్యార్థిని, నరేశ్ బుధవారం గుడిపల్లి జలాశయం వద్దకు వచ్చారు.
శివాలయంలోని శివమాలధారులు వారిని గమనించి వివరాలు అడగ్గా రిజర్వాయర్ చూడటానికి వచ్చామన్నారు. తరవాత వెళ్లిపోయిన వారు గురువారం ఉదయం 11 గంటల సమయంలో మళ్లీ జలాశయం వద్ద కనిపించారు. మాలధారులు మధ్యాహ్నం గ్రామంలోకి వెళ్లి వచ్చేసరికి జలాశయం ఒడ్డున పాదరక్షలు, వాచీలు, చరవాణి కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. రేవల్లి ఎస్సై శ్రీనివాసులు వెంటనే సిబ్బందితో వచ్చి చరవాణి పరిశీలించగా అది యువతి ఫోన్గా తేలింది. తామిద్దరం నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించడం లేదని, ఈ విషయమై కొట్టారని, మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వచ్చేయగా ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని, అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు సమాచారం పంపినట్లు అందులో ఉంది. దీంతో వెంటనే గజ ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 8 గంటల వరకు ఆచూకీ దొరకలేదు. గాలింపు చర్యలు ఆపేశారు. ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్సై తెలిపారు. యువకుడు నరేశ్కు 6 ఏళ్ల కిందటే వివాహం కాగా ఆరు నెలల పాప కూడా ఉంది. అతని వెంట ఉన్న యువతి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని కాగా, అతనికి సమీప బంధువు.
చరవాణిలో లేఖ
కళాశాలకు వెళ్తున్నానని చెప్పి.. : గుడిపల్లి జలాశయం కాలువలో గల్లంతైన యువతి ఈ నెల 13న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని కల్వకుర్తి ఠాణాలో తల్లిదండ్రులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. వరుసకు బావయ్యే నరేశ్పై అనుమానం ఉందని పేర్కొన్నారు. బాలిక అపహరణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు రోజులుగా వారి చరవాణిల వివరాలు తెలుసుకుని ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నామని కల్వకుర్తి ఎస్ఐ మహేందర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం