అందుబాటులో గురుకులం
ఎస్సీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. అందుబాటులో ఉన్నత ప్రమాణాలతో కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్టుడే, అచ్చంపేట
అచ్చంపేటలో ప్రయోగాలు చేస్తున్న గురుకుల విద్యార్థులు
ఎస్సీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. అందుబాటులో ఉన్నత ప్రమాణాలతో కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో పాటు వృత్తి విద్యా కోర్సులున్నాయి. ఇంటర్ తరగతుల నిర్వహణతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, క్లాట్, సీఎంఏ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారు. ఈ గురుకులాల్లోని ప్రతిభ కళాశాలల్లో (కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్) చదివిన విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తుండటం విశేషం.
● ఉమ్మడి జిల్లాలో బాలురకు మూడు, బాలికలకు రెండు మొత్తం అయిదు ప్రతిభా కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఎంపీసీలో 40, బైపీసీలో 40 చొప్పున ఉమ్మడి జిల్లాలోని 5 కళాశాలల్లో 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ, వృత్తి విద్యా కళాశాలలు బాలురకు మూడు, బాలికలకు 10 వంతున ఉమ్మడి జిల్లాలో 13 కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 560 సీట్లు, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో 80 సీట్లు, వృత్తి విద్యా కోర్సుల్లో 160 సీట్లు వంతున మొత్తం 800 సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు గడువు 25..
గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్లో జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. విద్యార్థులకు బహుళైచ్చిక పద్ధతిలో 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయిస్తారు. తప్పు జవాబు రాస్తే ఒక్కో ప్రశ్నకు పావు మార్కు తగ్గిస్తారు. విద్యార్థుల ప్రతిభతోపాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ప్రమాణాలు ఉన్నతం..
సాధారణ, వృత్తి విద్యా కళాశాలలు● బాలురకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, లింగాల, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర కళాశాలలున్నాయి.
● బాలికలకు నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూరు, తెలకపల్లి, వనపర్తి జిల్లాలోని గోపాల్పేట, పెద్దమందడి, జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, మహబూబ్నగర్ జిల్లాలో రాంరెడ్డి గూడెం, నంచర్ల, నారాయణపేట జిల్లాలో మరికల్, ఊట్కూరు, నారాయణపేట కళాశాలలు.
విధానం ఇలా..
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పేరు, ఇంటి పేరు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి పుట్టిన తేదీ ధ్రువీకరణ, చరవాణి సంఖ్య, ఇంటర్మీడియట్లో ఎంపిక చేసుకోబోయే గ్రూపు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల పేరు, మాధ్యమం, పాఠశాల చిరునామా, విద్యార్థి ఆధార్ సంఖ్య, కులం, ఉప కులం, గ్రూపు వివరాలు, విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, గ్రామం, మండలం, ప్రస్తుత జిల్లా, పాత జిల్లా, విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు, పిన్కోడ్ సంఖ్య తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలి.
బాలురకు.. : నాగర్కర్నూలు జిల్లాలోని జేపీనగర్ (కల్వకుర్తి), వనపర్తి జిల్లాలోని మదనాపూర్, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల కళాశాలలు
బాలికలకు.. : మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు కళాశాలలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు