చిత్రవార్తలు
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గద్వాల
సెలవుల వేళ చిన్నారులు జాగ్రత్త !
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గద్వాల మండలం బీరెల్లి గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలోకి వెళ్లి గుంతల్లో నిలిచిన నీటిలో ఈత నేర్చుకుంటూ కనిపించారు. నదిలో పెద్ద పెద్ద రాళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏమాత్రం అదుపు తప్పినా, నీటిలో మునిగినా వారి ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదముంది.
- ఈనాడు, మహబూబ్నగర్
అందరూ ఉన్నా అనాథలా అమ్మ..!
రోడ్డు పక్కన నిద్రపోతున్న ముడావత్ టుగ్రీ
ముగ్గురు కొడుకులు.. అయిదుగురు కూతుళ్లను నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్లను చేసింది. వారంతా పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో స్థిరపడేలా చేసిన ఆ అమ్మ.. వయోభారంతో నడవలేని దీనస్థితిలో మతిస్థిమితం సరిగా లేక రోడ్డెక్కింది. ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. ఎలా వెళ్లాలో తెలియని స్థితిలో రోడ్డు పక్కన కూలబడింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంది. వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని ఓ తండాకు చెందిన 90 ఏళ్ల ముడావత్ టుగ్రీ ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చింది.. అలసిసొలసి రోడ్డు పక్కన చెట్టు నీడలో నిద్రలోకి జారుకుంది. సాయంత్రం వరకు రోడ్డుపై అలాగే ఉండిపోయింది. తండావాసులు చూసి ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పెద్దకొడుకు, మూడో కొడుకు వచ్చి అమ్మను ఇంటికి వెళ్లారు.
- న్యూస్టుడే, వనపర్తి గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు