సంక్షిప్త వార్తలు
రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ టి.కృష్ణ కథనం ప్రకారం.. ఏనుగొండకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆంజనేయులు(65).. ఇంటికి సమీపంలో
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
మహబూబ్నగర్ పట్టణం, న్యూస్టుడే : రైలు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ పట్టణం ఏనుగొండ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ టి.కృష్ణ కథనం ప్రకారం.. ఏనుగొండకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆంజనేయులు(65).. ఇంటికి సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్(దిల్లీ)కు వెళ్తున్న ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ ఢీకొంది. వృద్ధుడికి చెవులు వినిపించని కారణంగా రైలు రాకను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
ధన్వాడ : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడిన సంఘటన పేట జిల్లా ధన్వాడ మండలంలో చోటుచేసుకొంది. ఎస్సై పి.రమేష్ కథనం మేరకు.. నారాయణపేట పట్టణానికి చెందిన మహ్మద్ ఖాజా సండ్కే (23) మహబూబ్నగర్లో సెల్ఫోన్ మెకానిక్గా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం మిత్రుడు మహ్మద్ ఆసీఫ్తో కలిసి ద్విచక్రవాహనంపై మహబూబ్నగర్కు వెళ్తుండగా ధన్వాడ శివారులో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహన మెకానిక్ సందీప్ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి మహ్మద్ ఖాజా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. రక్షణ కోసం ధరించిన శిరస్త్రాణం సైతం ప్రాణాలను కాపాడలేకపోయింది. మిత్రుడు ఆసీˆఫ్ స్వల్ప గాయాలతో బటయపడ్డాడు. సందీప్కు సైతం బలమైన గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రమేష్ ప్రమాద స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి, మహ్మద్ ఖాజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పేట ఆసుపత్రికి తరలించారు.
లారీపై నుంచి టైరు మీదపడి..
నిఖిల్రెడ్డి
పరిగి గ్రామీణం, కోయిలకొండ : లారీపై ఉన్న స్టెప్నీటైరు ద్విచక్ర వాహనంపై పడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన పరిగి మండల పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కోయిల్కొండ మండలం బూరుగుపల్లికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతుల కుమారుడు నిఖిల్రెడ్డి(21) పరిగి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా బోరుబావులను తవ్వే పరికరాలు, పైపులను తరలించే లారీ అతివేగంగా వస్తోంది. కల్వర్టు దగ్గర లారీలో ఉన్న టైరు పైకి లేచి నిఖిల్రెడ్డిపై పడటంతో తల పగిలి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనం దూరంగా ఎగిరిపడింది. టైరు వేగంగా పక్కనున్న వంతెనకు ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లిందని, ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు మరో వాహనదారుడు వివరించాడు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణాలు బలితీసుకున్న లారీ డ్రైవర్ లారీతోపాటు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
[ 28-03-2024]
జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు. -
అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
[ 28-03-2024]
అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ దేవి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు -
గద్వాల పట్టణంలో భారీ చోరీ
[ 28-03-2024]
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది. -
మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!
[ 28-03-2024]
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
మక్తల్ నుంచి భాజపా ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. -
నాగర్కర్నూల్ స్థానాన్ని గెలిచి కానుకగా ఇస్తాం
[ 28-03-2024]
భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్ సభ్యుడు పి.రాములు అన్నారు. -
డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ కన్ను
[ 28-03-2024]
మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. -
మన్యంకొండలో పూర్ణాహుతి
[ 28-03-2024]
మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో... -
మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
[ 28-03-2024]
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. -
అడుగంటుతున్న వరదాయని
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. -
మహిళా సంఘాలకే ఎక్కువ కేంద్రాలు
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు. -
చిన్నారులకు బాల ఆధార్
[ 28-03-2024]
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. ఇది గుర్తింపుకార్డు మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఇదే ప్రామాణికంగా మారింది. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ... -
పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్చుప్!
[ 28-03-2024]
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అనిశా వలలో తహసీల్దార్
[ 28-03-2024]
ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ ఘటన గుండుమాల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. -
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 28-03-2024]
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్ అధికారి బాలకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM