ఓటు.. భవితకు చోటు
ఓటు.. ఈ మాట వింటే సామాన్యుడు తన చేతిలోని ఆయుధం అని భావిస్తాడు. ప్రతి ఒక్కరి ఓటు ఎంతో కీలకమైంది. ఇంతటి గొప్ప హక్కును కలిగి ఉండటం భారత పౌరులందరి బాధ్యత. వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడం
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
న్యూస్టుడే, గద్వాల న్యూటౌన్
ఓటు.. ఈ మాట వింటే సామాన్యుడు తన చేతిలోని ఆయుధం అని భావిస్తాడు. ప్రతి ఒక్కరి ఓటు ఎంతో కీలకమైంది. ఇంతటి గొప్ప హక్కును కలిగి ఉండటం భారత పౌరులందరి బాధ్యత. వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించడం కోసమే భారత ఎన్నికల సంఘం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం..
జోగులాంబ గద్వాల జిల్లాలో గత జాబితా ప్రకారం.. మొత్తం 4,55,811 మంది ఓటర్లున్నారు. ఈ నెల 5న ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. జిల్లాలో 4,58,728 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గద్వాల నియోజకవర్గంలో 2,37,093 మంది, అలంపూర్ నియోజకవర్గలో 2,21,635 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే.. 2,917 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. పురుషులు 2,28,195 మంది ఉంటే, మహిళలు 2,30,523 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.
ఫారం - 6
18 సంవత్సరాలు నిండిన వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో పేరు, తండ్రిపేరు, గ్రామం తదితర వివరాలతో ఫారాన్ని పూర్తి చేయాలి. దీనికి గ్రామ నివాసిగా ధ్రువీకరణ పత్రం, ఏదైనా వయస్సు నిర్ధారిత పత్రం, ఫోటో, స్థానికంగా ఉండే ఎవరిదైనా ఓటరు గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది.
ఫారం - 7
ఓటరు నమోదుకు ఫారం-6 ఎంత అవసరమో.. ఓటరును తొలగించేందుకు ఫారం-7 అవసరం ఉటుంది. ఈ ఫారం ద్వారా ఎవరైనా తమ ఓటును తొలగించుకోవచ్చు. చనిపోయిన వారివి, వివాహం చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారివి, వేరే గ్రామాల్లో స్థిరపడిన వారి ఓట్లు తొలగించుకోవాలంటే.. ఫారం-7 పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. స్థానిక బీఎల్వో విచారణ చేసి ఓటు తొలగిస్తారు.
ఫారం - 8
ఫారాం-8 అనేది ఓటరు ఏవైనా సవరణలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. పేరు మార్పు, చిరునామా, వయస్సు, ఫోటో ఇలా అన్ని రకాల మార్పులకు ఈ ఫారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లేదా నేరుగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయవచ్చు. దరఖాస్తు ఫారంలో ఏదైతే మార్పు చేయాలనుకుంటున్నామో దానికి సంబందించిన ధ్రువీకరణపత్రాలను జత చేయాలి.
ఫారం - 8ఏ :
మండలం, గ్రామం ఇలా ఏది మారినా.. అక్కడ ఓటు హక్కు పొందాలనుకుంటే ఫారం-8ఏ తో దరఖాస్తు చేసుకోవచ్చు. శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉద్యోగ, వ్యాపారరీత్యా, ఇతర ఏవైనా కారణాలతో వేరే గ్రామాల్లో స్థిరపడిన వారు నివాసముండే గ్రామంలో ఓటు హక్కు పొందాలంటే ఈ ఫారంతో దరఖాస్తు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.