గురుకులం.. భవిత ఉజ్వలం
మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది. విద్యార్థినులకు చదువుతో పాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలు
మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తులకు ఫిబ్రవరి 3 గడువు
న్యూస్టుడే, మహబూబ్నగర్ అర్బన్
మహబూబ్నగర్ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం తరగతి గదిలో విద్యార్థినులు
మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది. విద్యార్థినులకు చదువుతో పాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. దీని ద్వారా విద్యార్థినులు ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా కళాశాలల్లో సీట్లు, సదుపాయాలపై ‘న్యూస్టుడే’ కథనం.
విద్యార్థినులకు వరం : మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి సమీపంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, తిరుమల హిల్స్లో గిరిజన మహిళా డిగ్రీ గురుకులం, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో గురుకులం డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నా అధునాతన వసతులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులతో పాటు ఆట స్థలం, గ్రంథాయల సదుపాయాలు కల్పించారు. బోధన సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉన్నారు. కళాశాలకు ప్రహరీ ఉంది. ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
సదుపాయాలివీ : బీకాం(కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంపీసీˆ, బీఎసీˆ్స(డీఎస్) బీజెడ్సీˆ, ఎంజెడ్సీ, బీకాం(బీఏ), బీఏ(హెచ్ఈపీˆ), ఎంఎస్సీˆఎస్ తదితర కోర్సులు ఉండగా విద్యార్థినులకు కాస్మొటిక్ ఛార్జీల కింద ప్రతి నెలా రూ. 140 అందజేస్తున్నారు. విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, దుస్తులు, ట్రాక్షూట్, క్యాజువల్ దస్తులు, తువ్వాలు, బూట్లు, ప్లేట్, గ్లాసు, ట్రావెలింగ్ బ్యాగు, దుప్పట్లు, పరుపు ఉచితంగా అందజేస్తారు. పరీక్ష రుసులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఐఐటీ, పీˆజీ ప్రవేశ పరీక్షలకు అవసరమైన ప్రత్యేకమైన శిక్షణను ఇస్తున్నారు. డిగ్రీ తర్వాత అవకాశం ఉన్న పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. పీˆజీ, క్యాట్, మ్యాట్, జామ్, ప్రవేశ పరీక్షలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు శిక్షణ ఇస్తారు.
చక్కటి అవకాశం : నిరుపేద విద్యార్థినులకు గురుకుల విద్యాలయాలు వరంగా చెప్పవచ్చు. ఏటా ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి. చదువుకోవాలనే ఆసక్తి, శ్రద్ధ, ఉన్నతంగా ఎదగాలనే ఆకాంక్ష ఉంటే చాలు. అన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది.
- డా.జయప్రద, ప్రిన్సిపల్, పిల్లలమర్రి గురుకులం, మహబూబ్నగర్.
నమోదు ఇలా.. : గురుకుల డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఇంటర్లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 90 శాతం సీˆట్లు ఎసీˆ్సలకు కేటాయిస్తారు. ప్రతి కోర్సులో 40 సీˆట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. అర్హత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల సమర్పణకు వేళాయె
[ 18-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
వారసత్వంపై అలసత్వం
[ 18-04-2024]
రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెట్టింది పేరు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
[ 18-04-2024]
గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
మయూరి ఉద్యానం.. భద్రత కనం
[ 18-04-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది. -
తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి
[ 18-04-2024]
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. -
ఐటీ కారిడార్ ఏర్పాటు.. ఉపాధి కల్పనకు కృషి
[ 18-04-2024]
నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో ఐటీ కారిడార్, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. -
పార్కులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
[ 18-04-2024]
మహబూబ్నగర్కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్ కథనం ప్రకారం.. -
నాయకా.. అభివృద్ధి పనుల్లో ఏదీ కదలిక?
[ 18-04-2024]
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు. -
‘మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్’
[ 18-04-2024]
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్ నాయకులు ధ్వజమెత్తారు. -
తనువు చాలించిన గర్భిణి
[ 18-04-2024]
ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. -
అంతా సీతారామం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది. -
దేశంలో రామరాజ్యానికి అడుగులు : డీకే అరుణ
[ 18-04-2024]
అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్