తొలిరోజు పాఠం54.69 శాతం వినలే
కొవిడ్ మూడోదశ విజృంభించటంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దూరదర్శన్, టీశాట్ ఛానళ్ల ద్వారా మొదటి రోజు 8, 9, 10
ఇతర పనుల్లోనే ఉన్న 15,860 విద్యార్థులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ అర్బన్
మిడ్జిల్ : వస్పుల గ్రామంలో టీవీలో పాఠం వింటున్న విద్యార్థిని, పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు
కొవిడ్ మూడోదశ విజృంభించటంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దూరదర్శన్, టీశాట్ ఛానళ్ల ద్వారా మొదటి రోజు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు టీబీ పాఠాలు బోధించారు. తొలిరోజు ఆన్లైన్ తరగతులకు ఏకంగా 54.69 శాతం విద్యార్థులు దూరంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. తొలిరోజు టీవీ పాఠాలు ఎంతమంది విద్యార్థులు విన్నారనే విషయమై ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి లెక్కలు తీశారు. మహబూబ్నగర్ జిల్లాలోని 15 మండలాల పరిధిలో 8, 9, 10 తరగతి చదివే విద్యార్థులు మొత్తం 28,995 మంది ఉన్నారు. వీరిలో మొదటి రోజు 13,135 మంది(45.31 శాతం) విద్యార్థులే ఆన్లైన్ పాఠాలు విన్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కన 15,860 మంది పిల్లలు ఇతర పనుల్లోనే ఉండిపోయారని తెలుస్తోంది.
సమస్యలు పునరావృతం : దూరదర్శన్, టీశాట్ ఛానళ్ల ద్వారా తరగతులను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఏ సమయంలో ఏ తరగతుల వారికి ఆన్లైన్ పాఠాలు బోధిస్తారనే వివరాలను ముందుస్తుగా విద్యార్థులకు అందించకపోవడంతో ఆన్లైన్ పాఠం వినలేదని అనేక మంది విద్యార్థులు వాపోయారు. మరికొందరు ఆన్లైన్ పాఠాలు వినేందుకు సౌకర్యాలు లేవని తెలిపారు. సాంకేతిక సమస్యలు గతేడాది మాదిరిగానే పునరావృతం అయ్యాయి. చాలా మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం, నెట్వర్క్ సమస్యలు వేధించడంతో నిరుపేద విద్యార్థులు ఆన్లైన్ పాఠాలకు దూరమయ్యారనే చెప్పవచ్చు. కొందరు ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లి పరిశీలించగా.. మరికొందరు చరవాణిలోనే సంప్రదించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని లేదని, అందుకే చరవాణిలో వివరాలు సేకరించామని తెలిపారు. మరికొందరు ఇళ్లకు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆన్లైన్ పాఠాల ప్రాధాన్యం వివరించారు.
ఆకస్మిక తనిఖీలు, పరిశీలన : జిల్లా విద్యాధికారి ఉషారాణి జడ్పీహెచ్ఎస్ ఏనుగొండ, కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎనుగొండ పాఠశాలలో కొవిడ్ నిబంధనల అమలు, ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. జడ్పీహెచ్ఎస్ బాలానగర్ (బాలికల) పాఠశాలను ఏఎంవో వెంకట్రామిరెడ్డి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు 50 శాతం ఉందో లేదో చూశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఉన్న సిబ్బంది బోధన, బోధనేతర సిబ్బంది 50 శాతం చొప్పున వంతుల వారీగా ఈనెల 24 నుంచి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్నగర్లోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో మాత్రం వందశాతం ఉపాధ్యాయులు హాజరు కావడం విశేషం. ఈ విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించగా.. 50 శాతం చొప్పున రెండు గ్రూఫులుగా విభజించి విధులు కేటాయించేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది అందరినీ ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!