బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం
బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు నెలల నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు
మూడు నెలల్లో 428 మందిపై కేసుల నమోదు
న్యూస్టుడే, పాలమూరు
మహబూబ్నగర్ : కొత్త చెరువు రోడ్డు వద్ద రాత్రి పూట తాగుతున్న మందుబాఋ
బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు నెలల నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు. పగలు, రాత్రి అన్ని తేడా లేకుండా మందుబాబుల అడ్డాలను తనిఖీ చేస్తూ పట్టుకుంటున్నారు. వెంటనే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చుతున్నారు. వారికి రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు జరిమానాలను విధిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 428 కేసులను నమోదు చేశారు. పోలీసుల తనిఖీలతో మందుబాబులు బహిరంగ ప్రాంతాల్లో తాగాలంటేనే భయపడుతున్నారు.
మందుబాబుల అడ్డాలకు చెక్
మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ పురపాలిక పరిధిలో మందుబాబుల అడ్డాలు చాలా ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామ ప్రాంతాల్లో ప్రత్యేక అడ్డాలు ఉన్నాయి. అనుమతి లేకుండా జాతీయ రహదారుల వద్ద ఉన్న ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర ప్రాంతాలతో పాటు ఖాళీస్థలాలు, రియల్ వెంచర్ల వద్ద మందుబాబులు సాయంత్రం కాగానే చేరి మద్యం తాగుతూ ఉంటారు. పలువురు పగలు, రాత్రి తేడా లేకుండా నివాసాల మధ్యనే తాగుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్తో పాటు డిజాస్టర్ మెనేజ్మెంట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.
డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు..
రహదారులపై మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిపై కూడా పోలీసులు నజర్ పెట్టారు. కూడళ్ల వద్ద పోలీసులు గస్తీ కాసి మందుబాబులను పట్టుకున్నారు. బ్రీతింగ్ అనలైజర్ యంత్రంతో పరీక్షలు చేసి మద్యం తాగిన వారిని గుర్తిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటంతో మద్యం తాగి వాహనాలను నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. వారిపై కేసులు పెట్టి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. తాగిన శాతం బట్టి జరిమానాలు లేదా జైలు శిక్షను విధిస్తున్నారు.
నిరంతరంగా కొనసాగిస్తాం : జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో బహిరంగ మద్యపానం వారిపై కేసులను నమోదు చేస్తున్నాం. మందుబాబులు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటున్నాం. మా సిబ్బంది అడ్డాలు తెలుసుకొని నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ఈ తనిఖీలను ముమ్మరం చేశాం.
జిల్లాలో నవంబర్ నుంచి నమోదైన కేసులు
- కిషన్, మహబూబ్నగర్ డీఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్