మాతా శిశువులకు ఆరోగ్య రక్ష
జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వనపర్తి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటికీ ప్రసవాలు ఎక్కువ జరగడం, సంరక్షణ కొరవడంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని
నేడు మంత్రులతో సంరక్షణ కేంద్రం ప్రారంభం
ప్రారంభానికి సిద్ధమైన మాతా శిశుసంరక్షణ కేంద్ర భవనం
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వనపర్తి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటికీ ప్రసవాలు ఎక్కువ జరగడం, సంరక్షణ కొరవడంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండేళ్ల క్రితం గోపాల్పేట రోడ్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రూ.17 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కొవిడ్ విజృంభణ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడుతూవస్తోంది. ఎట్టకేలకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. అక్కడే టీ హబ్ భవన నిర్మాణం, శిశు సంరక్షణ కేంద్రం గోపాల్పేట రోడ్డు వరకు సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు సంజీవని ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రాన్ని మంత్రులు ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో రూ.80 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, బైపాస్ యంత్రం, 12 పోటోథెరఫి యంత్రాలు ఏర్పాటుచేశారు. ఆసుపత్రిలో మరో రెండు వెంటిలేటర్లను సిద్ధం చేశారు. వీటిని ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్, నాగర్కర్నూల్ జిల్లా పర్యటనకు మంత్రులు వెళ్లనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్