త్రాసు.. తిరకాసు
సమతూకం లేని త్రాసులతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఓవైపు ధరల మోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోవైపు పలువురు వ్యాపారులు తూకాలలో మోసాలకు పాల్పడుతూ అడ్డగోలుగా
జిల్లాలో 80 శాతమే ఎలక్ట్రానిక్ కాంటాల వినియోగం
మూడు జిల్లాలకు ఒక్కరే ఇన్ఛార్జి
న్యూస్టుడే, వనపర్తి పట్టణం
సమతూకం లేని త్రాసులతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఓవైపు ధరల మోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోవైపు పలువురు వ్యాపారులు తూకాలలో మోసాలకు పాల్పడుతూ అడ్డగోలుగా దోచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వ్యాపార సంస్థలు ఉండగా వాటిలో 80 శాతం దుకాణాలలోనే ఎలక్ట్రానిక్ కాంటాలు వినియోగిస్తున్నారు. ఇక చిరు వ్యాపారులు సాధారణ త్రాసులనే ఉపయోగిస్తుండగా కొందరు పాతకాలం నాటి తక్కెడ, రాళ్లతోనే తూకాలు వేస్తున్నారు. సరకులను తూకంవేసే రాళ్లను ఉద్దేశపూర్వకంగా కోయడం, అవి సరిగా కనిపించకుండా చేసి మోసం చేయడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలుచోట్ల చేపలు, కూరగాయలు విక్రయించే వీధి వ్యాపారులు తక్కెడలను ఉపయోగిస్తూ తూకాలలో దండె కొడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
తూకం రాళ్లపై రెన్యువల్ ముద్ర వేస్తున్న కార్యాలయం ఉద్యోగి
సిబ్బంది లేక అవస్థలు.. : వినియోగదారులకు ఎలాంటి నష్టం వాటిల్లినా.. వ్యాపారుల చేతిలో మోసాలకు గురైనా న్యాయం చేయాల్సిన తూనికలు కొలతల శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న కొద్దిమందిపైనే పని భారం పెరిగి వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వనపర్తి జిల్లా అధికారి సత్యనారాయణకు గద్వాల, నారాయణపేట జిల్లాల ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఈ మూడు జిల్లాలలో పర్యటించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వనపర్తి, గద్వాల జిల్లా కార్యాలయాలలో కేవలం ఇద్దరు సిబ్బందే పనిచేస్తుండగా నారాయణపేటలో ఒక్క ఉద్యోగి కూడా లేరు. దీంతో మూడు జిల్లాల బాధ్యతలను మోస్తున్న అధికారి రోజూ ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ అడపాదడపా తనిఖీలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు, సంస్థల కేసులు నమోదు చేస్తున్నారు.
నిబంధనలు పాటించని వైనం..
చాలామంది వ్యాపారులు నిబంధనలు పాటించకుండా తూకాలు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగించేవారు కచ్చితంగా ప్రతి సంవత్సరం తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికి వచ్చి తనిఖీ చేయించుకొని వాటిపై రెన్యువల్ ముద్ర వేయించుకోవాలి. తూకం రాళ్లు, బాట్లను ఉపయోగించేవారు ప్రతి రెండేళ్లకు ఒకసారి కాంటాలు, బాట్లను రెన్యువల్ చేయించుకోవాల్సి ఉండగా ఈ నిబంధనలను చాలామంది పాటించడం లేదని తెలుస్తోంది. అలాగే ప్రతి వస్తువుపై ప్రభుత్వం నిర్ణయించి ముద్రించిన ఎమ్మార్పీ ధరలను సైతం వ్యాపారులు అమలుచేయకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది వినియోగదారులు తాము మోసానికి గురవుతున్నామని తెలిసినా అధికారులకు ఫిర్యాదుచేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేస్తేనే తప్ప తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేయడం లేదు.
తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నాం..
నేను బాధ్యతలు నిర్వహిస్తున్న మూడు జిల్లాల్లో ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే వెంటనే తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నాం. రెండు రోజుల క్రితం కొత్తకోటలో గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనలపై నాలుగు కేసులు నమోదు చేశాం. గత ఏడాది ఓ పెట్రోలుపంపుపై కేసు నమోదుచేసి రూ.20 వేల జరిమానా వసూలు చేశాం. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు పాత కాలం నాటి తక్కెడలు ఉపయోగిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. త్వరలో ప్రత్యేక డ్రైవ్లో తనిఖీలు చేపడతాం. ఆధునిక, ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగించాలని వారికి సూచిస్తాం.
- సత్యనారాయణ, తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
[ 27-03-2024]
మండల కేంద్రమైన రాజోలిలో హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. -
రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
[ 27-03-2024]
మండల కేంద్రమైన రాజోలిలో హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. -
భాజపా విజయానికి కృషి చేయాలి
[ 27-03-2024]
రానున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి కోరారు. -
విండో సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
[ 27-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, విండో ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. -
కంచే చేను మేస్తోంది..!
[ 27-03-2024]
అనాథలు, వంచనకు గురైన మహిళలు, చిన్నారులకు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వాల్సిన కేంద్రాల్లో కొందరి తీరు ‘కంచే చేను మేసిన’ చందంగా ఉంటోంది. -
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
[ 27-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. -
శుభకార్యాలకు కోడ్ కష్టాలు
[ 27-03-2024]
నారాయణపేట అంటేనే బంగారం, చేనేత చీరలకు ప్రసిద్ధి.. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, ఏపీల నుంచి ప్రజలు వేల సంఖ్యలో కొనుగోళ్లకు వస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. -
దర్జాగా కబ్జా
[ 27-03-2024]
ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
నిరుద్యోగులకు వరం... డిజిటల్ గ్రంథాలయం
[ 27-03-2024]
సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా వివిధ కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
మాయమాటలతో మైనార్టీలు మోసపోవద్దు : డీకే అరుణ
[ 27-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ మాయమాటలు నమ్మి మైనార్టీలు మోసపోవద్దని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు
[ 27-03-2024]
అనారోగ్యంతో తండ్రి మృతిచెందిన బాధను దిగమింగి ఏడాదంతా చదివిన చదువు వృథా కావద్దని భావించి విద్యార్థిని పదోతరగతి పరీక్షకు హాజరైంది. -
పరిశ్రమల్లో అగ్నికీలలు
[ 27-03-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యజమానులు పరిశ్రమల్లో తగిన అగ్నిమాపక సాధనాలు ఏర్పాటు చేసుకోకపోవటం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
[ 27-03-2024]
ఈ ఏడాది తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా నదిలో నీటి వినియోగం పెరిగింది. మిషన్ భగీరథ ద్వారా మరో రెండు నెలల వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. -
మరికల్లో భూచోళ్లు
[ 27-03-2024]
జిల్లాలో ప్రధాన కూడలి మరికల్. ఉమ్మడి పాలమూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి దాటాల్సిందే...దీంతో మరికల్ పట్టణ రూపురేఖలు సంతరించుకుంది. -
బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు
[ 27-03-2024]
మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. -
వన్యప్రాణుల వేటగాళ్లకు రూ.66వేల జరిమానా
[ 27-03-2024]
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం దుబ్బతండా అటవీ ప్రాంతంలో జంతువులను పట్టుకునేందుకు వచ్చిన ఆరుగురికి మంగళవారం రూ.66 వేల జరిమానా విధించినట్లు అటవీశాఖ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పర్వేజ్అహ్మద్ తెలిపారు. -
వసతి గృహంలో షార్ట్ఫిలిం చిత్రీకరణపై ఘర్షణ
[ 27-03-2024]
మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో సోమవారం రాత్రి కొందరు బయటి వ్యక్తులు చొరబడి షార్ట్ఫిలిం చిత్రీకరించడంపై ఘర్షణ చోటు చేసుకొంది. పాత ఠాణాలో హాస్టల్ను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట