గబగబా తింటే గండమే
గొంతులో మాంసం ముక్కలు, బజ్జీలు, గుడ్లు, ఇతర ఇతర ఆహార పదార్థాలు ఇరుక్కొని మృత్యువాత పడుతున్నారు. తిన్న ఆహారం అన్నవాహికలో నుంచి కడుపులోకి ప్రవేశిస్తే...
గొంతులో ఆహారం ఇరుక్కుని పోతున్న ప్రాణాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు
న్యూస్టుడే, పాలమూరు
కోడేరు మండలం ఎత్తం గ్రామంలో నారాయణ(63) అనే వ్యక్తి ఈనెల 19న ఓ కార్యక్రమంలో భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. శ్వాస ఆడలేదు. సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోగానే అతను మరణించాడు. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ మహిళ మృతిచెందింది. మిడ్జిల్ మండలం చేదుగట్టుతండాలో ముత్యాలమ్మ పండుగ నిర్వహించారు. చంద్రు(60) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా గొంతులో మటన్ ముక్క ఇర్కుని చనిపోయాడు. ఇదే మండలం వేములలో మల్లేశ్(32) గొంతులో బజ్జీ ఇరుక్కుని చనిపోయాడు. ..ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులను సంప్రదించి ‘న్యూస్టుడే’ అందిస్తున్న కథనమిది.
గొంతులో మాంసం ముక్కలు, బజ్జీలు, గుడ్లు, ఇతర ఇతర ఆహార పదార్థాలు ఇరుక్కొని మృత్యువాత పడుతున్నారు. తిన్న ఆహారం అన్నవాహికలో నుంచి కడుపులోకి ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్న వాహికలోకి కాకుండా శ్వాస నాళంలోకి వెళ్తే ఇబ్బందులు వస్తాయి. కానీ చాలామంది తిన్న ఆహారాన్ని సక్రమంగా నమలకుండా ఒకేసారి మింగేస్తుంటారు. ఈ క్రమంలో శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కొని ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్నాయి. కుటుంబ సభ్యులు వెంటనే వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే గొంతులో ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు తొలగిస్తారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లకపోయినా శ్వాసనాళంలో ఆహారం కొంత ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. కచ్చితంగా తొలగించుకోవాలి.
తాగి ఉంటే ప్రమాదమే..
మద్యం తాగేటప్పుడు చాలా మంది మాంసం, బజ్జీలు వంటివి తింటుంటారు. మద్యం ఎక్కువైనప్పుడు గొంతులో కండరాలపై నియంత్రణ కోల్పోతారు. నోట్లో వేసుకున్న ముక్కను సక్రమంగా నమలలేరు. వాటిని అలాగే మింగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిషాలో ఉండటంతో వారికి తెలియకుండానే అవి గొంతులోకి వెళతాయి. వెళ్లిన ముక్కలు శ్వాస నాళంలోకి చేరటంతో ఇబ్బందులు వస్తాయి. అందుకే మద్యం తాగుతూ మాంసం, ఇతర ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. తింటూ మాట్లాడటం కూడా ప్రమాదకరం.
వీపుపై గట్టిగా కొట్టాలి..
ఆహారం తినేటప్పుడు గొంతులో ఎలాంటి ముక్క ఇరుక్కున్నా.. వెంటనే వీపుపై గట్టిగా కొట్టాలి. అతడికి దగ్గు వచ్చేలా చూడాలి. దగ్గినప్పుడు గొంతులో ఉన్న ముక్క బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధితుడు కూడా బలంగా దగ్గుతూ గొంతులో ఇరుక్కొని పోయిన ముక్క బయటకు వచ్చేలా చేయాలి.
నమలకుండా తినకూడదు..
- డా.శ్రీకాంత్, ఈఎన్టీ వైద్య నిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మహబూబ్నగర్
తినేటప్పుడు మాంసం, ఇతర పదార్థాలు బాగా నమిలి మింగాలి. అప్పుడే సరిగ్గా జీర్ణమవుతుంది. గబగబా తింటే గొంతులో ఇరుక్కొంటాయి. శ్వాస నాళంలోకి అడ్డుగా వెళ్తే ప్రాణాలు కూడా పోతాయి. మద్యం సేవించే వారికే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎంత ప్రయత్నించినా గొంతులోని ఆహారం వెళ్లకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2 లక్షల నగదు పట్టివేత
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..