ఔషధ వ్యాపారం పైపైకి..
ఔషధ దుకాణాలు వేగంగా పెరుగుతున్నాయి..ప్రధానంగా కరోనా తరవాత వీటి సంఖ్య ఎక్కువవుతోంది.. కరోనా మొదటి దశ తరవాత రెండేళ్లలో 407 దుకాణాలు పెరిగాయంటేనే విస్తరిస్తున్న ఈ వ్యాపారాన్ని అంచనా వేయొచ్చు. ఔషధ నియంత్రణ శాఖ ఉమ్మడి జిల్లా అధికారుల
కరోనా తరవాత పెరుగుతున్న దుకాణాలు
రోజుకు వ్యాపారం రూ.1.10 కోట్ల్ఞు
న్యూస్టుడే, పాలమూరు
ఔషధ దుకాణాలు వేగంగా పెరుగుతున్నాయి..ప్రధానంగా కరోనా తరవాత వీటి సంఖ్య ఎక్కువవుతోంది.. కరోనా మొదటి దశ తరవాత రెండేళ్లలో 407 దుకాణాలు పెరిగాయంటేనే విస్తరిస్తున్న ఈ వ్యాపారాన్ని అంచనా వేయొచ్చు.
ఔషధ నియంత్రణ శాఖ ఉమ్మడి జిల్లా అధికారుల నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 2020 ఏప్రిల్ కంటే ముందు 1,161 దుకాణాలు ఉండేవి. కరోనా తరవాత ఔషధాలకు డిమాండ్ బాగా పెరిగింది. వ్యాధులు వచ్చిన తరవాత వాడేవే కాకుండా, ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధకత పెంచుకోవడానికి విటమిన్ టాబ్లెట్ల వినియోగం పెరగడంతో వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. కరోనా సోకితే మందులు దొరుకుతాయో లేదోనని చాలా మంది ముందే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో రోజుకు రూ.2.20 కోట్ల వ్యాపారం సాగిన రోజులున్నాయి. ఆ డిమాండ్ ఔషధ దుకాణాల ఏర్పాటుపై ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానికులు నిర్వహిస్తున్నవి 1,568 దుకాణాలు ఉండగా, మరో 200 దుకాణాల వరకు కార్పొరేట్ సంస్థలకు చెందినవి ఉన్నాయి. ఒక్క మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కరోనా కంటే ముందు ఓ కార్పొరేట్ సంస్థకు చెందిన ఔషధ దుకాణాలు 6 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 20కి పెరిగింది. వచ్చే రెండు, మూడు నెలల్లో మరో 10 దుకాణాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ఔషధ దుకాణాల ద్వారా రోజుకు సగటున రూ.1.10 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆ వ్యాపార వర్గాలు తెలిపాయి. 2020 ఏప్రిల్కు ముందు రోజుకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకే వ్యాపారం ఉండేదని పేర్కొన్నాయి.
దుకాణాలు పెరగడానికి కారణాలు
* కరోనా తరవాత ఔషధ వ్యాపారం లాభసాటిగా ఉందన్న అభిప్రాయం పెరగడం.
* ఉమ్మడి జిల్లాలో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు నేరుగా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. అనుబంధంగా ఔషధ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
* ఫార్మసీ విద్య పూర్తి చేసినవారు65 శాతం సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా, మిగతా 35 శాతం తమ ధ్రువపత్రాలను ఇతరులకు ఇచ్చి అద్దె తీసుకుంటున్నారు.
* కార్పొరేట్ సంస్థలకు చెందిన పలు ఔషధ దుకాణాలు ఎక్కువవుతున్నాయి. ఇవి ఔషధాల కొనుగోళ్లపై రాయితీలు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 5 వేల కుటుంబాలకు ఆధారం
ఉమ్మడి జిల్లాలో 5 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఔషధ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్నాయని ఔషధ దుకాణాల సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పుల్లా శ్రీనివాస్ చెప్పారు. ఇటీవల ఆన్లైన్లో ఔషధాలు తెప్పించుకోవడం పెరిగిందన్నారు. మందుల చీటీ లేకుండా తాము కొన్ని ఔషధాలు విక్రయించలేమని, అంతర్జాలం ద్వారా విక్రయాలకు మాత్రం ఎలాంటి పర్యవేక్షణ లేదని చెప్పారు. ఔషధ నియంత్రణశాఖ ఉమ్మడి జిల్లా ఏడీ దినేష్కుమార్ అన్ని అర్హతలు ఉన్న దుకాణాలకే అనుమతిస్తున్నామని చెప్పారు. దుకాణాలలో తప్పనిసరిగా ఫార్మసిస్టు ఉండాలనే నిబంధనలను అందరూ పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలను పాటించని వారికి శ్రీముఖాలను జారీ చేస్తున్నామని, కొన్ని దుకాణాల అనుమతులను రద్దు చేస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలయ మండపానికి భూమి పూజ
[ 24-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించేందుకు శ్రీ భ్రమరాంబిక అడిగేశ్వర స్వామి ఆలయ మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు