మూగజీవాల సేవకుల మౌనరోదన
వ్యవసాయంలో రైతుకు చేదోడువాదోడుగా ఉంటే పశువులకు ఏదైనా జబ్బు చేసిందంటే అన్నదాత విలవిల్లాడుతాడు. తాను ఉంటున్న గ్రామం నుంచి మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు మూగజీవిని తీసుకువెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఫోను
వేతనాలు అందక ఇబ్బందిపడుతున్న 1962 సంచార పశు వైద్యశాల సిబ్బంది
న్యూస్టుడే, వనపర్తి
సంచార పశువైద్యశాల వాహనం
వ్యవసాయంలో రైతుకు చేదోడువాదోడుగా ఉంటే పశువులకు ఏదైనా జబ్బు చేసిందంటే అన్నదాత విలవిల్లాడుతాడు. తాను ఉంటున్న గ్రామం నుంచి మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు మూగజీవిని తీసుకువెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఫోను ద్వారా స్పందించి సంచార వైద్యశాల పేరిట రైతు ముంగిటకే వెళ్లి పశువైద్య సిబ్బంది మూగజీవాలకు వైద్యం అందిస్తున్నారు. నోరులేని జీవాలు ఏ ప్రాంతంలో, ఏ ఆపదలో ఉన్నా 1962 నంబరుకు ఫోన్చేస్తే చాలు సిబ్బంది అక్కడికి చేరుకుని సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా జీవీకే ఈఎంఆర్ఐ (1962) పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో పడ్డారు. వీరికి ఏనాడూ నెల నెలా జీతాలు చెల్లించడం లేదు. రెగ్యులరుగా వచ్చే జీతాల కోసం మూడు, నాలుగు నెలల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. కరోనా కష్టకాలంలో అయితే 10 నెలల వరకూ జీతాలు అందని సందర్భాలు ఉన్నాయి. తాజాగా మూడు నెలల వేతనాలు రావాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. అవి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇచ్చేదే అరకొర.. అవీ సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
సెగ్మెంటుకు ఓ వాహనం
అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో పశు వైద్య సేవలందించేందుకు 1962 పేరిట ప్రత్యేకంగా ఓ వాహనాన్ని ఏర్పాటుచేశారు. దాన్నే పశు సంచార వైద్యశాలగా పిలుస్తున్నారు. ఒక్కో వాహనంలో పశు వైద్యుడు/వైద్యురాలు, పారా వెట్, సహాయకుడు, డ్రైవర్ మొత్తం నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏ ప్రాంతం నుంచైనా 1962 నంబరుకు రైతులు ఫోనుచేసి సమాచారమిస్తే వైద్య సిబ్బంది వాహనంలో అక్కడికి వెళ్లి మూగజీవాలకు సేవలందిస్తారు. ఉదయం ఏడు గంటల కన్నా ముందే ఆ ప్రాంతానికి చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసర సేవలందిస్తారు.
ఆటంకం లేకుండా సేవలు..
ఒకవైపు జీతాలు సక్రమంగా అందక సంచార వైద్యశాల సిబ్బంది నానా యాతన పడుతున్నా, రైతులకు అందించే సేవల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. ఒకేసారి రెండు ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోకుండా రైతులకు కాస్త సమయం ఇవ్వాలని నచ్చజెప్పి వారి ముంగిటకే వెళ్లి సేవలందిస్తున్నారు. నియోజకవర్గానికో సంచార వైద్యశాల ఉన్నా వనపర్తి జిల్లాలో పూర్తిస్థాయిలో ఒకే నియోజకవర్గం ఉంది. దీంతో సమీపంలోని కొల్లాపూరు నియోజకవర్గం పరిధిలోని పాన్గల్, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోటలో ఇక్కడి సిబ్బందే చేరుకుని సేవలందిస్తున్నారు. మందుల కొరత కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో చీటీలు రాస్తున్నామని, వాటిని మార్కెట్లో కొనుగోలుచేసి రైతులు జీవాలకు వేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
జీతాలు రెగ్యులరుగా ఇస్తే బాగు..
సంచార పశు వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి రెగ్యులరుగా జీతాలు రావడం లేదు. కరోనా కాలంలో జీతాలు రాక మా సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయిదారు నెలల పాటు పనిచేస్తే ఒక నెల జీతమే వస్తోంది. నాలుగు నెలల పెండింగ్ కోసం ఎదురుచూస్తున్నాం. జీతాలు సక్రమంగా చెల్లిస్తే సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.
- సాయిప్రకాశ్, సంచార పశు వైద్యాధికారి, వనపర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.