logo

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ప్రేమావతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

Updated : 07 Aug 2022 05:49 IST


జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ప్రేమావతి

పాలమూరు : జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ప్రేమావతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు పూర్తిగా సహకరించాలని కోరారు. కక్షిదారులకు ఇబ్బందులు కలగకుండా, ఒత్తిడికి గురి చేయకుండా రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకునేలా కృషిచేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంధ్యారాణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని