నాగర్కర్నూల్ వైద్య కళాశాలలో తరగతుల నిర్వాహణకు అనుమతి
నాగర్కర్నూల్ జిల్లా వైద్య రంగంలో మరో అడుగు ముందుకుపడింది. ఇప్పటికే వైద్య కళాశాల మంజూరవగా భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ చొరవతో వేగంగా పూర్తి చేయించారు.
న్యూస్టుడే, కందనూలు
నాగర్కర్నూల్ : ఉయ్యాలవాడ వద్ద పూర్తయిన వైద్య కళాశాల భవనం
నాగర్కర్నూల్ జిల్లా వైద్య రంగంలో మరో అడుగు ముందుకుపడింది. ఇప్పటికే వైద్య కళాశాల మంజూరవగా భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ చొరవతో వేగంగా పూర్తి చేయించారు. జనరల్ ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వసతులను, మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను భారత వైద్య మండలి సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలలో మొదటి సంవత్సరానికి సంబంధించిన తరగతులు నిర్వహించడానికి శనివారం ఆదేశాలు జారీ చేసింది.
తొలి విడతలో 150 మందికి..
నాగర్కర్నూల్ జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలలో తొలి విడతలో 150 మంది వైద్య విద్యార్థులను భర్తీ చేయడానికి కేంద్ర వైద్య కమిషన్ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలలో తరగతులు ప్రారంభించేందుకు అనుమతి లభించింది. నీట్ పరీక్ష ఫలితాల అనంతరం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రమాదేవి వెల్లడించారు. వైద్య కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పించడానికి పురపాలక సంఘం పరిధిలోని ఉయ్యాలవాడ వద్ద రూ. 38 కోట్లతో భవన నిర్మాణం పూర్తయ్యింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీంతో పాటు మెడికల్ కళాశాలకు అనుబంధంగా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిని 330 పడకలకు పెంచి జనరల్ ఆసుపత్రిగా ఉన్నతీకరించారు.
అందుబాటులోకి పీజీ కోర్సులు..
ప్రస్తుత 2022-23 విద్యా సంవత్సరంలో 150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్ విద్యార్థుల మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. మూడేళ్లు గడిచేలోగా స్థానిక వైద్య కళాశాలలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో జనరల్ ఆసుపత్రిని 650 పడకల స్థాయికి పెంచే అవకాశాలున్నాయి. మొదటి సంవత్సరంలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి 12 మంది ప్రొఫెసర్లను, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. స్థానిక వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించడానికి కేంద్ర వైద్య మండలి సభ్యులు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసినట్లు జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. రఘు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరింత మంది వచ్చే అవకాశం ఉందని జనరల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది చెబుతున్నారు.
వనపర్తి కళాశాలకు ఎప్పుడు?
వనపర్తి : వనపర్తి జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులకు అనుమతిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. జిల్లాకు గతేడాది ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. జిల్లా సమీకృత కలెక్టరు కార్యాలయ సముదాయ భవనం వద్దనే 50 ఎకరాలు కేటాయించారు. నర్సింగ్ కళాశాల నిర్మాణం పనులను చక చకా పూర్తిచేశారు. అందులోనే వైద్య కళాశాలను కొనసాగించాలని నిర్ణయించారు.. కానీ కళాశాలను నడిపేందుకు కావాల్సిన కేంద్ర వైద్య కమిషన్ అనుమతి మాత్రం ఇంకా రాలేదు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఒకేసారి వైద్య కళాశాలలు మంజూరవగా, నాగర్కర్నూల్ కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి వచ్చింది. వనపర్తిది మాత్రం ఇంకా తేలలేదు. నీట్-2022 పూర్తయ్యింది. త్వరలోనే ఫలితాలు వచ్చి ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఇంకా అనుమతి విషయం తేలకపోవడంతో ఈ విద్యా సంవత్సరం వనపర్తి కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయా.. లేవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) బృందం ఒకసారి వచ్చి విచారణ చేసి వెళ్లింది. రెండోసారి వస్తామని పేర్కొన్నా ఇంతవరకు రాలేదు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి నిరంజన్రెడ్డిని సంప్రదించగా ఈ సంవత్సరమే వనపర్తి వైద్య కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని ఎలాంట¨ అనుమానం అక్కరలేదన్నారు.. కళాశాలల విచారణ తేదీలను బట¨్ట అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్తారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా వైకుంఠ నారాయణస్వామి రథోత్సవం
[ 23-04-2024]
పౌర్ణమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణస్వామి రథోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. -
మామా అల్లుళ్లు.. నా సవాల్కు సిద్ధమా?: రేవంత్రెడ్డి
[ 23-04-2024]
భారాస హయాంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. -
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్