ముంగిట ముంపు భయం
కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు తెగిపోతూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆక్రమణలతో నీటి వనరులు కుంచించుకుపోవటంతో ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. జడ్చర్ల పురపాలికలోనూ
జడ్చర్లలో ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటల చుట్టూ నిర్మాణాలు
బాదేపల్లి ఊరచెరువు సమీపంలో ముంపు ముప్పు పొంచి ఉన్న ఇళ్లు
న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం: కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు తెగిపోతూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆక్రమణలతో నీటి వనరులు కుంచించుకుపోవటంతో ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. జడ్చర్ల పురపాలికలోనూ ఈ పరిస్థితి నెలకొనటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని చెరువులు, కుంటల చుట్టూ నివాసాలు ఏర్పడటంతో రెండు రకాల సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గటంతో పాటు ముంపు సమస్య పెరుగుతున్న వైనంపై ‘న్యూస్టుడే’ కథనం.
జడ్చర్ల పురపాలిక పరిధి చెరువులు, కుంటలను కొన్నేళ్లుగా పట్టించుకోకపోవటంతో తెగిపోయే ప్రమాదముంది. ఇక్కడి భూములకు డిమాండు పెరగడంతో చెరువులు, కుంటలు, పాటు కాల్వలు కబ్జాకు గురయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిశాయి. చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. ఈ వర్షాల వల్ల ఆయా కుంటలన్నీ వరద నీరు, మురుగుతో నిండిపోయాయి. నీరు పెరిగితే సమీప ఇళ్లు ముంపునకు గురవుతాయి. చెరువులకు సమీపంలోనే నివాసాలు ఉండటంతో దుర్వాసన, ఈగలు, దోమలతో రోగాల బారినపడే ప్రమాదముంది.
చెరువుల వారీగా పరిస్థితి
వర్షాలతో కావేరమ్మపేటలోని నల్లచెరువులోకి భారీగా నీరు, మురుగు చేరింది. సమీపంలో ఉన్న పారిశ్రామికవాడ, అటుగా నిర్మించిన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. కావేరమ్మపేట బాబానగర్ సమీపంలోని ఊరకుంటలో కూడా మురుగు చేరింది. ఇక్కడ తీవ్ర దుర్వాసన, దోమలు, ఈగల సమస్య ఉన్నా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాత్రికి రాత్రి ఓ ప్రజాప్రతినిధి భర్త పొక్లెయిన్తో ఈ ఊరకుంట కట్టను తెంపడంతో మురుగు పొలాల్లోకి వెళ్లి రైతులు నష్టపోతున్నారు. బాదేపల్లిలోని ఊరచెరువులోని మురుగు పోచమ్మ ఆలయ సమీపానికి చేరింది. శివాలయం సమీపంలో ఇళ్లు, కట్టకు ఆనుకొని ఉన్న నివాసాలు, ఎఫ్టీఎల్ పరిధిలోని భవనంలో మానసిక రోగుల కోసం ఏర్పాటుచేసిన ఆశ్రమం చుట్టు, విద్యానగర్ కాలనీ, అల్మాస్ వెంచర్ ప్రాంతంలో ఇళ్లకు ముప్పు ఉంది. ఇక్కడ ఉన్న మరో కుంట తూము, కట్టకు ఆనుకొని అక్రమంగా కొందరు ప్రహరీ నిర్మించారు. పాటు కాల్వలను కూడా మూసివేశారు. ఎత్తు ప్రాంతాల నుంచి వర్షపు నీరు కుంటలు, చెరువుల్లోకి చేరుతోంది. దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్ల గిడ్డంగి కూడా ఉంది. బురెడ్డిపల్లిలో ఉన్న రెండు కుంటల చట్టూ వెంచర్లు వెలిశాయి. నిర్మాణాలు జరిగితే ప్రమాదం తప్పదు. నల్లకుంటలో లాగే ఇక్కడ కూడా మురుగు చేరకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుత పాలకవర్గం చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, కట్ట, అలుగులు ఉన్నచోట నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని స్థానికులు కోరుతున్నారు.
పాలకవర్గంతో చర్చించి చర్యలు చేపట్టాం - మహమూద్ షేక్, కమిషనర్, జడ్చర్ల పురపాలిక
పురపాలిక ఛైర్పర్సన్ లక్ష్మి.. పాలకవర్గ సభ్యులతో కలిసి బాదేపల్లి ఊరకుంట, నల్లచెరువు, కావేరమ్మపేట ఊరకుంట, బురెడిపల్లిలోని కుంటలను పరిశీలించాం. ఊరచెరువు అలుగు వద్ద నీరు పారేందుకు తూము వద్ద ఏర్పాట్లు చేశాం. ఊరచెరువు, నల్లచెరువుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం, వెంచర్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వం. ప్రజలు ఇలాంటి చోట ఇళ్లు కట్టుకోవద్దు. చెరువులు, కుంటల్లో వ్యర్థాలు వేయొద్దు. ఎవరైనా ఇందుకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి