ఓటు.. ఆధార్.. అనుసంధానం
ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రారంభించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 6-బీ ఫారంతో ఓటర్లే స్వయంగా ఆన్లైన్ ద్వారా వారి ఆధార్ వివరాలు నమోదు చేసుకునే
ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
ఓటరు జాబితా
న్యూస్టుడే గద్వాల న్యూటౌన్: ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రారంభించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 6-బీ ఫారంతో ఓటర్లే స్వయంగా ఆన్లైన్ ద్వారా వారి ఆధార్ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. బోగస్ ఓట్ల ఏరివేత, డబుల్ ఓట్ల తొలగింపునకు ఆధార్ అనుసంధానం ఉపయోగపడనుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ఓటర్లు స్వచ్ఛందంగా మాత్రమే చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంటోంది.
గద్వాల జిల్లాలో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. 4,58,728 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,28,195 మంది, మహిళలు 2,30,523 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు. రెండు నియోజకవర్గాలకు ఒక వైపు కర్ణాటక, మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండటంతో ఇక్కడి ప్రజలకు అక్కడి ప్రాంతాలతో అనుబంధం, బంధువులు ఎక్కువ. దీంతో రెండు ప్రాంతాల్లోనూ ఓటు హక్కులు కలిగి ఉన్న వారున్నారు. ఒకే గ్రామంలో డబుల్ ఓట్లు, నకిలీ ఓట్లు ఉన్నట్లుగా గత ఎన్నికల్లో బయట పడింది. కొందరు నాయకులు గ్రామాలు, మండలాల్లో వారికి అనుకూలమైన వ్యక్తుల పేర్లను తాము పోటీ చేసే చోట ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు.
స్వచ్ఛందంగానే అవకాశం..
పట్టణాలకు వలస వచ్చిన వారికి పురపాలికల్లో, పంచాయతీల్లోనూ ఓట్లు ఉంటున్నాయి. ఇదే సమయంలో అర్హులైన వారి పేర్లు జాబితా నుంచి మాయమవుతున్నాయి. గత ఎమ్మెల్యే, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ నాడు ప్రజలు అధికారులతో గొడవకు దిగిన సంఘటనలు వెలుగు చూశాయి. మూడు నెలల క్రితం ఎన్నికల సంఘం ‘ఫోటో సిమిలర్ ఎంట్రీస్’ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఒక్కో మండలంలో 200 మందికి పైగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని పరిశీలించిన అధికారులు చాలా ఓట్లను తొలగించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓటుకు ఆధార్ అనుసంధానం చేపట్టడం ద్వారా బోగస్ ఓట్ల లెక్క తేలిపోతుంది. అయితే ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమే కావడంతో.. ఇంకా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కొందరు స్వచ్ఛందంగా అనుసంధాన ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
17 ఏళ్లకే ఓటు హక్కు
ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలనుకునే వారు 18 ఏళ్లు నిండిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇలా చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి ఓటుహక్కు కల్పిస్తారు. ఇకపై 17 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది యువతకు అవకాశం లభించనుంది. అలాగే ఓటు హక్కు నమోదుకు ఏడాదికి ఒక సారి కల్పించేది. ఇకపై ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం ఏడాదికి నాలుగు సార్లు కల్పించనుంది. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు మాసాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇలా మూడు నెలలకు ఒక సారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, ఓటరు జాబితాపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండటం జరుగుతుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!