తరగతుల నిర్వహణకు అనుమతి
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అనుమతి వచ్చింది.. 2022-23 విద్యాసంవత్సరానికి కాళోజీ నారాయణరావు హెల్త్సైన్సెస్ విశ్వవిద్యాలయం, వరంగల్ పరిధిలోని వైద్య కళాశాలలో
వనపర్తి వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
నిర్మాణం పూర్తయిన భవనం
న్యూస్టుడే- వనపర్తి, వనపర్తి న్యూటౌన్: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అనుమతి వచ్చింది.. 2022-23 విద్యాసంవత్సరానికి కాళోజీ నారాయణరావు హెల్త్సైన్సెస్ విశ్వవిద్యాలయం, వరంగల్ పరిధిలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను నిర్వహించేందుకు జాతీయ వైద్య కమిషన్ అనుమతిని ఇచ్చింది. వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరు భవన సముదాయం వెనుక సర్వే నం.200లో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పూర్తయింది. ఎన్ఎంసీ బృందం బుధవారం జిల్లాకు వచ్చి జనరల్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, వసతులు, వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆనక అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా నీట్ నుంచే...
వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి రావడంతో తాజాగా నీట్ 2022 పరీక్ష రాసిన విద్యార్థులు 2022-23 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 150 మందికి ప్రవేశం కల్పించనున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సెలింగు నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని 330 పడకలకు పెంచి జనరల్ ఆసుపత్రిగా ఉన్నతీకరించారు.
ఇచ్చిన హామీ మేరకు వైద్యకళాశాల - నిరంజన్రెడ్డి, రాష్ట్ర మంత్రి
గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వనపర్తికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఈ ఏడాదే తరగతులను ప్రారంభించనున్నాము. వైద్య కళాశాల కోసం 50ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.510 కోట్లతో కళాశాల భవనం, పరిపాలనా భవనం, విద్యార్థుల, సిబ్బంది వసతిగృహాల నిర్మాణాన్ని చేపట్టాం. వైద్య కళాశాలతో వనపర్తి రూపురేఖలే మారిపోనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావులకు వనపర్తి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ మద్యం పట్టివేత
[ 25-04-2024]
రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత, కేసు నమోదు
[ 25-04-2024]
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా