ప్రాంగణాలు సరే.. పరికరాలేవీ?
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 319 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామానికి ఒకటి మాత్రమే కాకుండా
యాభైశాతం దాటని క్రీడా మైదాన నిర్మాణాలు
పెద్దమందడి బడిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం
న్యూస్టుడే- వనపర్తి, పెద్దమందడి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 319 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామానికి ఒకటి మాత్రమే కాకుండా అవసరమున్న చోట రెండు కూడా ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో స్థల లభ్యతను బట్టి ఒక ఎకరా, అర ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ప్రాంగణానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 145 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఇంకా యాభైశాతం పూర్తి చేయాల్సి ఉంది. క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినా పరికరాలేవీ లేకపోవడంతో నిర్మించి ఉపయోగం లేకుండా పోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..
గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు నిరాశకు లోనవుతున్నారు. అందుబాటులో ప్రాంగణాలు వుంటేనే క్రీడాకారులు, విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో అనువైన ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ఒక ఊరిలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంగణాలు మరో ఊరిలో ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
పరికరాలపై స్పష్టత కరవు
గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో భాగంగా వాలీబాల్ కోర్టు, కబడ్డి, ఖో..ఖో.. స్తంభాలు, హారిజెంటల్ బార్, ప్యారలల్ బార్, లాంగ్జంప్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణాలు ఏర్పాటు చేసినా విద్యార్థులు, యువత ఆడుకోడానికి అవసరమైన క్రీడా పరికరాలు అందించలేదు. దాని విషయమై స్థానిక సర్పంచులను అడిగితే అధికారులు ఆ ఊసే ఎత్తలేదంటున్నారు. ప్రాంగణాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఈ విషయమై డీఆర్డీవో నర్సింహులుతో మాట్లాడగా జిల్లాలో 319 క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం 145 పూర్తయ్యాయని చెప్పారు. మిగతావి త్వరలోనే పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థలం ఉన్న చోట ఏర్పాటు చేయాలని ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో దూరమవుతోందని చెప్పారు. క్రీడాపరికరాలకు సంబంధించి ఇంకా బడ్జెటు రాలేదన్నారు.
* గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో ప్రాంగణం దూరంగా ఉంది. విద్యార్థులు సమీపంలో ఉండాలని కోరుకుంటున్నారు.
* పెద్దమందడి మండలం గౌరయ్యకుంట తండాలో ప్రాంగణాన్ని కుంటలో ఏర్పాటు చేశారని, వర్షాలు ఎక్కువగా కురిస్తే ప్రాంగణమంతా నీరు నిండి ఆటలకు అవరోధంగా మారుతుందన్నారు.
* అనకాయపల్లి తండాలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంగణానికి తగిన స్థలం లేకపోవడంతో పక్కనే ఉన్న దొడగుంటపల్లిలో ఏర్పాటు చేశారని తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల పాఠశాలల్లో ఉన్న మైదానాలలోనే కొత్తగా నాలుగు ట్రాక్టర్ల మొరంమన్ను పోసి క్రీడాప్రాంగణం అయ్యిందనిపించారన్న విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు