ముద్ద చర్మవ్యాధితో ముప్పు
పశుసంపదకు ఆపద వచ్చింది. ప్రధానంగా తెల్లజాతి పశువులను ముద్ద చర్మ(లంపి స్కిన్) వ్యాధి సోకటం రైతులు, పశు సంవర్ధక అధికారులను కలవరపెడుతోంది. వర్షాలు కురవటంతో దోమలు, ఈగల బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వెలుగుచూస్తున్న కేసులు
అన్నదాతలు, అధికారులు అప్రమత్తమైతే మేలు
న్యూస్టుడే, మహబూబ్నగర్ వ్యవసాయం, కల్వకుర్తి న్యూటౌన్
వడ్డేపల్లి : కొంకల గ్రామంలో ముద్ద చర్మ వ్యాధి సోకిన దూడ
పశుసంపదకు ఆపద వచ్చింది. ప్రధానంగా తెల్లజాతి పశువులను ముద్ద చర్మ(లంపి స్కిన్) వ్యాధి సోకటం రైతులు, పశు సంవర్ధక అధికారులను కలవరపెడుతోంది. వర్షాలు కురవటంతో దోమలు, ఈగల బెడద ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ముద్ద చర్మ వ్యాధి సోకిన ఆనవాళ్లు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. వడ్డేపల్లి మండలం కొంకల, తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామాలతో పాటు చాలా చోట్ల ముద్ద చర్మ వ్యాధి లక్షణాలతో పశువులు బాధపడుతున్నాయి. వాటి రక్తనమూనాలు కూడా ఇంతవరకు సిబ్బంది సేకరించలేదు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పశువైద్యశాలలు, ప్రైవేటు సిబ్బందితో వైద్యం చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులంతా అప్రమత్తం కావాల్సిన అవసరముంది. పశువుల చర్మంపై పొక్కులు, నోట్లో బొబ్బలు, జ్వరం పెరగటం వంటివి ఉన్నవేమో రోజూ గమనిస్తూ ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి వైద్యం అందేలా చూడాలి.
పశుసంవర్ధక శాఖ ఆదేశాలు : రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మార్గదర్శకాలు జారీ చేయటంతో పాటు రైతులకు సూచనలు ఇవ్వాలని పశువైద్యులను ఆదేశించింది. స్థానికంగా ఉండే పశువ్యాధి నిర్ధారణ కేంద్రాల వైద్యులకు కూడా రక్త పరీక్షలు చేపట్టాలని సూచించింది. కానీ రక్త నమూనాలు సేకరించిన దాఖలాలు మాత్రం లేవు. అనుమానం ఉన్నచోట్ల స్థానిక వైద్యాధికారులు గోట్పాక్స్ టీకాలు ఇస్తున్నారు. గతంలో ఈ టీకాలను ఇచ్చామని, ముద్దచర్మ వ్యాధి వస్తోందన్న వార్తల నేపథ్యంలో మళ్లీ వేస్తున్నామని మహబూబ్నగర్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.మధుసూదన్గౌడ్ చెప్పారు. హైదరాబాద్లోనిపశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారి డా.కల్యాణిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా రైతులకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేశామన్నారు. రైతులు వ్యాధి వచ్చినట్లు అనుమానం ఉంటే వాటిని మందలో కలపకుండా దూరంగా ఉంచాలన్నారు. మండల కేంద్రాల్లోని పశువైద్యశాలల్లో యాంటి బయాటిక్స్, యాంటి పైరేటిక్స్, యాంటీ హిస్టామైన్లు, మల్టీ విటమిన్లు సిద్ధంగా ఉంచామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వ్యాధి లక్షణాలు..
* దోమలు, ఈగలు, గోమార్ల ద్వార ముద్ద చర్మ వ్యాధి వ్యాపిస్తుంది.
* పశువులు నీరసంగా మారి జ్వరం 104 డిగ్రీల వరకు ఉంటుంది.
* చర్మంపై కణతలు, దద్దుర్లు, పొక్కులు, కాళ్లల్లో వాపు కనిపిస్తాయి.
* ఆవుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. సూడి ఆవులు ఈడ్చుకుపోతాయి.
* పశువుల చర్మంపై మొదట మచ్చలు ఏర్పడుతాయి.
* మచ్చలు ఏర్పడిన చోట ఏడు రోజుల్లో చర్మం పగిలి పుండ్లు ఏర్పడుతాయి.
ఉమ్మడి జిల్లాలో తెల్లజాతి పశుసంపద
మహబూబ్నగర్ 90,324
నాగర్కర్నూల్ 2,40,301
వనపర్తి 75,689
నారాయణపేట 1,00,770
గద్వాల 72,416
ఆవులు, ఎద్దులు, దూడలు
నివారణ చర్యలు..
* పశువుల కొట్టంలో ఈగలు, దోమలు, గోమార్లు ఉండకుండా పరిశుభ్రంగా ఉంచాలి.
* వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి.
* కొత్త, ఇతర పశువులతో కలవనివ్వొద్దు. వ్యాధి సోకిన వాటికి దోమల తెరలు వాడాలి.
* వ్యాధి సోకిన పశువును రాగిజావ, నూకల జావ, పచ్చిగడ్డి, విటమిన్లను అందిస్తే నొప్పులు తగ్గుతాయి.
* జ్వరం తగ్గించుటకు, దురద, చర్మం మీద మచ్చలు తగ్గించుటకు వేర్వేరు మందులు వాడాలి.
* ఈ వ్యాధి వచ్చి చనిపోతే కళేబరాలను మట్టిలో పూడ్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా