పండుగ ఖర్చులకు పరేషాన్
రోజూ కూలీ పనులకు వెళ్తేకాని కుటుంబం గడవని జీవితాలు వారివి. వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులు చేసుకొంటున్నారు. అయితే పనులు చేసినా సకాలంలో డబ్బులు అందక నానా అవస్థ పడుతున్నారు కూలీలు.
డబ్బులు రాక ఉపాధి హామీ కూలీల అవస్థ
ఏడు వారాల వేతనాలు పెండింగ్
న్యూస్టుడే, నారాయణపేట న్యూటౌన్
రోజూ కూలీ పనులకు వెళ్తేకాని కుటుంబం గడవని జీవితాలు వారివి. వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులు చేసుకొంటున్నారు. అయితే పనులు చేసినా సకాలంలో డబ్బులు అందక నానా అవస్థ పడుతున్నారు కూలీలు. దసరా పండుగ కేవలం రెండ్రోజులే ఉన్నా పిల్లలను కొత్త దుస్తులు తెచ్చుకోలేదు. పిల్లలకు దుస్తులు మాట అటుంచి.. కనీసం పండుగ సరకులు ఎలా తెచ్చుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనికి వారానికి ఒకసారి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. జిల్లాలో కొందరికి అయిదు వారాలు, మరికొందరికి ఏడు వారాల డబ్బులుగా డబ్బులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే చెల్లిస్తే దసరా పండుగను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటామని అంటున్నారు.
రూ. 3.28 కోట్ల బకాయిలు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ బిల్లులు సుమారు రూ.3.26 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిలో సామగ్రి రూపేణా అందాల్సిన బకాయిలే రూ.2.82 కోట్లు ఉన్నాయి. కూలీల బకాయిలు రూ.44 లక్షలు, మేటీలకు రూ.2.42 లక్షలు చెల్లించాల్సి ఉంది. మక్తల్ మండలంలో అత్యధికంగా కూలీలకు రావాల్సింది రూ.13.83 లక్షలు, మెటీరియల్ పనులకు రూ.58.87 లక్షలు బకాయిలు ఉన్నాయి. మాగనూరు మండలంలో కూలీలకు రూ.4.07 లక్షలు, మరికల్ మండలంలో రూ.4.83 లక్షలు, ధన్వాడలో రూ.3.74 లక్షలు, నర్వలో రూ.3.57 లక్షలు.. ఇలా ప్రతి మండలంలోనూ రూ.లక్షల్లో బకాయిలు ఉన్నాయి. ఒక్క కోస్గిలో మాత్రమే కేవలం రూ.51 వేలు మాత్రమే కూలీలకు అందాల్సి ఉంది. చేసిన పనికి డబ్బుల కోసం కూలీలతో పాటు పంచాయతీ సర్పంచులు ఎదురుచూస్తున్నారు. సర్పంచులు సామగ్రి కింద సీˆసీˆ రోడ్లు వేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టారు. ఈ నిధులన్నీ సర్పంచులకు అందాల్సి ఉంది. చేబదులు, అప్పులు తెచ్చి పనులు చేశామని, బకాయిలు రాకపోవడంతో వడ్డీ పెరుగుతోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమీపిస్తున్నా నిధులు జమ కాకపోవడంతో కూలీలు కూడా ఆందోళన చెందుతున్నారు.
రాంకిష్టాయపల్లి శివారులో మొక్కల సంరక్షణ పనులు నిర్వహిస్తున్న కూలీలు
నిధులు రావాల్సి ఉంది..
ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన బకాయి నిధులు విడుదల కాలేదు. ఈ పాటికే రావాలి. ఎందుకు జాప్యం అయిందో తెలియడం లేదు. కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో జమ అవుతాయని చెబుతున్నారు. నిధులు విడుదల కాగానే వారి వారి ఖాతాల్లో జమ అవుతాయి.
- గోపాల్నాయక్, డీఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!