టెండర్లలో గోల్మాల్!
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో నిర్మించిన 12 దుకాణాలకు ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించగా శుక్రవారం గడువు ముగిసింది.
మార్కెట్ యార్డు దుకాణాల కేటాయింపు పూర్తి
దుకాణాల టెండర్లను ఖరారు చేస్తున్న అధికారులు
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో నిర్మించిన 12 దుకాణాలకు ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించగా శుక్రవారం గడువు ముగిసింది. శనివారం టెండర్ దరఖాస్తులను పరిశీలించి ఖరారు చేశారు. ఇందులో గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రహారీని ఆనుకొని రెండుచోట్ల 6 చొప్పున దుకాణాలుండే సముదాయాలను నిర్మించారు. వాటిని కేటాయించడానికి అమల్లో ఉన్న రిజర్వేషన్లను పాటించారు. 12 దుకాణాల్లో ఎస్సీలకు 2, ఎస్టీకి 1, బీసీలకు 3, ఇతరులకు 6 కేటాయించారు. దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించాలని స్థానిక అధికారులు భావించినా.. ఉన్నతాధికారులు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో దుకాణానికి గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదైన ధరలను పరిగణనలోకి తీసుకొని అద్దెను నిర్ణయించారు. ఒక్కో దుకాణానికి రూ.5,742 అద్దె నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. ఈ అద్దెను పరిగణనలోకి తీసుకొని ఆసక్తి ఉన్నవారి నుంచి కార్యాలయంలోనే కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. టెండర్ గడువు ముగిసే నాటికి 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12 మంది అద్దె ప్రాతిపదికన దుకాణాలను దక్కించుకున్నారు. ఒక దుకాణానికి ఎక్కువగా 9వేలు, తక్కువగా 5,900లకు దక్కించుకున్నారు. ఆన్లైన్లో ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నా.. కార్యాలయంలోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడంతో కోట్ చేసిన ధరలు బహిర్గతమై అతి తక్కువ అద్దెలకు దుకాణాలను దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు సిండికేట్గా మారారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బహిరంగ వేలం నిర్వహిస్తే ఇంకా ఎక్కువగా అద్దెలు వసూలయ్యేవని యార్డులోని వ్యాపారులు అంటున్నారు. ఈ విషయమై యార్డు కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ.. సిండికేటు అయ్యేందుకు అవకాశం లేదన్నారు. ధరలు కోట్ చేసిన వ్యక్తి ఇతరులకు చెబితే ఏమీ చేయలేమన్నారు. ఆన్లైన్ విధానం టెండర్లు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ విధానంలో ఇప్పటికే చాలాచోట్ల టెండర్లు నిర్వహించినట్లు తెలిపారు. జాయింట్ డైరెక్టర్ ఇఫ్తికార్ అహ్మద్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ ప్రక్రియను పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్