పాలమూరు ధాన్యానికి డిమాండ్
ఈసారి సన్నరకం వడ్లకు డిమాండు పెరగడంతో వ్యాపారులు పోటీపడి ఖరీదు చేస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,060 ఉండగా వ్యాపారులు శనివారం దేవరకద్రలో వ్యాపారులు శ్రీరాం గోల్డ్ రకం ధాన్యానికి ఏకంగా రూ. 2,521 చెల్లించారు.
న్యూస్టుడే, జడ్చర్ల గ్రామీణం, మహబూబ్నగర్ వ్యవసాయం, దేవరకద్ర
ఈసారి సన్నరకం వడ్లకు డిమాండు పెరగడంతో వ్యాపారులు పోటీపడి ఖరీదు చేస్తున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,060 ఉండగా వ్యాపారులు శనివారం దేవరకద్రలో వ్యాపారులు శ్రీరాం గోల్డ్ రకం ధాన్యానికి ఏకంగా రూ. 2,521 చెల్లించారు. బాదేపల్లి మార్కెట్లో వ్యాపారులు రూ. 2,424 ధరతో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం కొనుగోలు చేశారు. మహబూబ్నగర్లో రూ. 2,334 ధర చెల్లించారు. జడ్చర్లలోని నాలుగు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కేవలం 22వేల బస్తాల ధాన్యం ఖరీదు చేయగా, మార్కెట్లో వ్యాపారులు అధిక ధరతో 98,765 బస్తాలు కొన్నారు. గతేడాది కంటే పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండటం చర్చనీయాంశమైంది.
నాణ్యత ఉండటమే కారణం : ఉమ్మడి జిల్లాలో ఈసారి సన్నరకం ధాన్యం నాణ్యత బాగుంది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి, నాణ్యత తగ్గాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మిల్లర్లతో పాటు, ఇతర ప్రాంతాల వ్యాపారులు బాదేపల్లి, మహబూబ్నగర్, దేవరకద్ర మార్కెట్లలో ఎక్కువగా పంట కొనుగోలు చేస్తున్నారు. బాదేపల్లి మార్కెట్కు నిజామాబాద్తో పాటు ఇతర జిల్లాల వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండటం విశేషం. రెండు వారాలుగా ధాన్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ధాన్యం తేమశాతం కొంత ఎక్కువగా ఉన్నా పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎగుమతుల కోసం ఎక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 5వేల క్వింటాళ్ల ధాన్యం ఖరీదు చేస్తుండటం విశేషం. గతేడాది మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మర ఆడించి బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉండగా చాలా మంది విఫలమయ్యారు. దీంతో ఈసారి ప్రభుత్వం ఆయా మిల్లర్లకు ధాన్యం ఇవ్వడానికి నిరాకరిస్తోంది. వ్యాపారులే ముందుకొచ్చి ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇది కూడా కారణమని తెలుస్తోంది.
ధర పెరిగే అవకాశం : గతేడాది వ్యాపారులు సన్నరకం ధాన్యానికి రూ. 2,100 మించి ధర చెల్లించలేదు. ఈసారి రూ. 2,400 చెల్లిస్తున్నారు. మరో రూ. 100 పెరిగే అవకాశం ఉందని ఉన్నాయని మార్కెట్లోని కమీషన్ ఏజెంటు గోవింద్రాం పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే డబ్బులు ఖాతాలో జమ కావడానికి వారానికి పైగా వేచిచూడాల్సి వస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అదే రోజే చెల్లిస్తుండటంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు. జడ్చర్లలోని 4 కొనుగోలు కేంద్రాల్లో గతేడాదితో పోలిస్తే రైతులు తక్కువ విక్రయిస్తున్నారని బాదేపల్లి పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్గౌడ్, యాదగిరి తెలిపారు. మెరుగైన ధరలు రావటంతో రైతులు ఆనందిస్తున్నారని మార్కెట్ కార్యదర్శి నవీన్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు గడ్డివాముల దగ్ధం
[ 29-03-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. -
ఇంటి పన్ను తప్పనిసరిగా వసూలు చేయాలి
[ 29-03-2024]
ఇంటి పన్ను వసూళ్లకు రెండు రోజులు గడువు ఉందని అందరూ 100 శాతం పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఐజ పురపాలక కమిషనర్ సత్యబాబు అన్నారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
మండంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు