ఆకలితో నీరసించి అస్వస్థత
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థినులు ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు.
పురుగుల అన్నం పెడుతున్నారని భోజనం మానేసిన విద్యార్థినులు
ఆరోగ్య కేంద్రానికి వచ్చిన విద్యార్థినులు.. చికిత్స పొందుతున్న బాలికలు
మహమ్మదాబాద్ : మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థినులు ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం వసతిగృహంలో వడ్డించిన అల్పాహారంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తినలేకపోయారు. పాఠశాలకు వెళ్లాక కళ్లు తిరిగి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు నీరసంతో పడిపోయారని తెలిపారు. వారం రోజుల నుంచి ఉదయం అల్పాహారం, రాత్రి భోజనంలో పురుగులు వస్తున్నాయని, నీళ్ల చారు వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. అల్పాహారం, అన్నంలో పురుగులు వస్తున్నాయని వంటవారికి చెబితే తీసేసి తినమన్నారని వాపోయారు. వార్డెన్ రెండు రోజులకోసారి వసతిగృహానికి వస్తారని, వంటలు బాగాలేవని చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలిసిన ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ యాదయ్య, తహసీల్దార్ ఆంజనేయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డీడీ యాదయ్యను ‘న్యూస్టుడే’ సంప్రదించగా కలెక్టర్కు నివేదిక అందిస్తామని, వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
-
Politics News
Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్
-
Politics News
Nellore: కోటంరెడ్డితోనే ప్రయాణం..ఆయనే మా ఊపిరి: నెల్లూరు మేయర్
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ