సంపద సృష్టించేందుకే దళితబంధు
ఎలాంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైన దళితులు ఆత్మవిశ్వాసంతో సంపద సృష్టించేలా తోడ్పాటు అందించేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు
మాట్లాడుతున్న మంత్రి నిరంజన్రెడ్డి, వేదికపై విప్ గువ్వల, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్
చారకొండ, న్యూస్టుడే : ఎలాంటి అవకాశం లేకుండా అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైన దళితులు ఆత్మవిశ్వాసంతో సంపద సృష్టించేలా తోడ్పాటు అందించేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో 269 మంది దళితబంధు లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే నమ్మకంతో దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షలు అందిస్తోందన్నారు. సీఎం దళితులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గానికి తాను స్థానికేతరుడినేనని, పుట్టింది వనపర్తిలోనైనా బతికేది, చచ్చేది ఈ గడ్డపైనేనన్నారు. 6 నెలల్లో మండలంలోని ప్రతి తండాకు రహదారిని నిర్మిస్తామన్నారు. రూ.12 కోట్ల నిధులతో శిర్సనగండ్ల అభివృద్ధి చేస్తామన్నారు. చారకొండ పట్టణంలోని రహదారిని నాలుగు రహదారులుగా విస్తరిస్తామన్నారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ దళితులు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. అంతకు ముందు నూతనంగా నిర్మించిన కేజీబీవీ భవనాన్ని, రైతువేదికను ప్రారంభించారు. డీసీసీబీ ఛైర్మన్ నిజాంపాషా, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీసింగ్, అదనపు కలెక్టర్ మోతిలాల్నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్నాయక్, ఎంపీపీ నిర్మల, సింగిల్విండో ఛైర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు గజ్జె యాదయ్య. ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల సమర్పణకు వేళాయె
[ 18-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
వారసత్వంపై అలసత్వం
[ 18-04-2024]
రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెట్టింది పేరు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
[ 18-04-2024]
గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
మయూరి ఉద్యానం.. భద్రత కనం
[ 18-04-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది. -
తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి
[ 18-04-2024]
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. -
ఐటీ కారిడార్ ఏర్పాటు.. ఉపాధి కల్పనకు కృషి
[ 18-04-2024]
నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో ఐటీ కారిడార్, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. -
పార్కులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
[ 18-04-2024]
మహబూబ్నగర్కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్ కథనం ప్రకారం.. -
నాయకా.. అభివృద్ధి పనుల్లో ఏదీ కదలిక?
[ 18-04-2024]
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు. -
‘మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్’
[ 18-04-2024]
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్ నాయకులు ధ్వజమెత్తారు. -
తనువు చాలించిన గర్భిణి
[ 18-04-2024]
ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. -
అంతా సీతారామం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది. -
దేశంలో రామరాజ్యానికి అడుగులు : డీకే అరుణ
[ 18-04-2024]
అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?