ప్రజా సమస్యలపై పోరాటం
గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్
జడ్చర్ల పట్టణం, న్యూస్టుడే : గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచాలన్నారు. బీసీల కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ పోరాట స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్గా సాంబశివగౌడ్, కోకన్వీనర్గా హనుమయ్య, సలహాదారులుగా చంద్రశేఖర్, మహతి, రమేశ్ను నియమించారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, నియోజకవర్గాల నాయకులు రామకృష్ణ, బాలస్వామి, రాములమ్మ, చెన్నరాములు, కృష్ణ, బాలవర్ధన్గౌడ్, సాగర్, సత్యం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..