logo

మద్దిమడుగు దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం

నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది.

Published : 29 Nov 2022 02:56 IST

మద్దిమడుగు ఆంజనేయస్వామి పాలకమండలి ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న విష్ణుమూర్తి

పదర (అమ్రాబాద్‌), న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు సమక్షంలో దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు శ్రీనివాసరాజు ఛైర్మన్‌ విష్ణుమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి సభ్యులు సామూహికంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో  స్వాగతం  పలికారు. ఎంపీపీ బీక్యానాయక్‌, జడ్పీటీసీ సభ్యుడు రాంబాబు, ఈవో రంగాచారి, ఉమామహేశ్వర దేవస్థానం ఛైర్మన్‌ సుధాకర్‌, అర్చకులు వీరయ్యశాస్త్రి, జయరాం గురుస్వామి, ఆలయ సిబ్బంది, తెరాస నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని