logo

తెదేపాకు పూర్వ వైభవం : కాసాని జ్ఞానేశ్వర్‌

తెదేపాకు పాలమూరులో పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సూచించారు. సోమవారం హైదరాబాదు నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

Published : 29 Nov 2022 02:56 IST

కాసాని జ్ఞానేశ్వర్‌తో మహబూబ్‌నగర్‌ తెదేపా నాయకులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : తెదేపాకు పాలమూరులో పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సూచించారు. సోమవారం హైదరాబాదు నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసిందన్నారు. నాటి వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా శ్రమించాలన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. సమావేశానికి రాష్ట్ర సీనియర్‌ నాయకుడు బి.చంద్రశేఖర్‌రెడ్డి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బాలప్ప, రాష్ట్ర కార్యదర్శి కాసీం, మండల నాయకులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి కునాల్‌, షబ్బీర్‌బాబా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని