ప్రజలకు భారం.. పురపాలికలకు ఆదాయం
ప్రభుత్వం ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంతాల జనాభా పది వేల ఓటర్లపైగా ఉంటే వాటిని పురపాలికలుగా గుర్తింపు ఇచ్చింది. పురపాలికలుగా మారిన తర్వాత రెండేళ్లు పరిస్థితి సవ్యంగా ఉన్నా..
వడ్డేపల్లి పురపాలికలో పన్ను వసూలు చేస్తున్న పుర సిబ్బంది
న్యూస్టుడే, ధరూరు, శాంతినగర్: ప్రభుత్వం ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంతాల జనాభా పది వేల ఓటర్లపైగా ఉంటే వాటిని పురపాలికలుగా గుర్తింపు ఇచ్చింది. పురపాలికలుగా మారిన తర్వాత రెండేళ్లు పరిస్థితి సవ్యంగా ఉన్నా.. ప్రస్తుతం ఇళ్ల యజమానుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. పురపాలికగా మారి అభివృద్ధికి అడుగులు పడ్డాయని సంతోష పడాలో లేక పన్నుల మోతతో సతమతం అవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో ఉన్న పన్నుకు ఇప్పటి పన్నుకు చాలా వ్యత్యాసం ఉండటంతో తమకు కష్టాలు తప్పటం లేదని పుర ప్రజలు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మక్తల్, కోస్గి, అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, భూత్పూరు, అలంపూర్, వడ్డేపల్లి పంచాయతీలు కొత్తగా పురపాలికలుగా ఏర్పాటయ్యాయి. ఉదాహరణకు వడ్డేపల్లి పంచాయతీలో గతంలో రూ.23 లక్షల వరకు ఏడాదికి పన్ను వసూలయ్యేది. తాజాగా పురపాలికగా ఏర్పడిన తర్వాత రెండేళ్ల వరకు పన్ను మినహాయింపు ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి కొత్త పన్నులు చేస్తుండగా రూ.1.50 కోట్లు వచ్చినట్లు పురపాలిక సిబ్బంది సమాచారం బట్టి తెలుస్తుంది. గతంలో ఉన్న పన్ను ఆదాయంతో పోలిస్తే ఏడింతలు పెరిగింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది పురపాలికల పరిధిలో గతంలో వసూలయ్యే పన్ను రూ.2.50 కోట్లు. పురపాలికలుగా ఏర్పడిన తర్వాత వసూలు చేస్తున్న పన్ను రూ.11.25 కోట్ల వరకు ప్రజలు కట్టాల్సి వస్తోంది.
రూ.6 వేలు వచ్చింది : గతంలో 800 చదరపు అడుగులు ఉన్న గృహానికి రూ.600 చెల్లించా. పురపాలిక ఏర్పడిన తర్వాత రూ.6,478 పన్ను విధించారు. తొమ్మిదింతలు పన్ను పెంచటంతో భారంగా మారింది. పనులు ఒకేసారి ఇంత మొత్తంలో పెంచకుండా విడతలవారీగా పెంచితే బాగుంటుంది.
- వెంకటనారాయణ, వడ్డేపల్లి పురపాలిక
అమల్లోకి నూతన విధానం ; పురపాలిక చట్టంలో మార్పులతో కొత్త విధానం నూతన పురపాలికల్లో అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శ్లాబుల ప్రకారం పన్ను విధానం ఉంటుంది. కొత్త పన్ను విధానం ప్రకారం వసూలు చేస్తున్నాం.
- నిత్యానంద్, వడ్డేపల్లి పురపాలిక కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2 లక్షల నగదు పట్టివేత
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?