ప్రజలతో సత్సంబంధాలకే కమ్యూనిటీ కనెక్ట్ : ఎస్పీ
ప్రజలతో నేరుగా సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునేలా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలు పరుస్తున్నట్లు ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ పోలీస్ ప్రధాన కా
డీజీపీ సమీక్షలో వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, చిత్రంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్
మహబూబ్నగర్ నేరవిభాగం, న్యూస్టుడే : ప్రజలతో నేరుగా సత్సంబంధాలను ఏర్పాటు చేసుకునేలా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలు పరుస్తున్నట్లు ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ మహేందర్రెడ్డి వీసీ ద్వారా శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీతో ఎస్పీ మాట్లాడారు. పలు అంశాలపై ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు, అపరిచిత వ్యక్తుల సంచారం, మొబైల్ ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులను, వ్యాపార లావాదేవీలను నమ్మరాదని యువత, ఉద్యోగులకు వివరిస్తున్నట్లు తెలిపారు. యువత బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచిస్తున్నామన్నారు. కుటుంబ తగదాల్లో సఖ్యత కుదర్చడంలో జిల్లా పోలీసు పనితీరుపై డీజీపీ సంతోషం వ్యక్తం చేసి సిబ్బందిని ప్రశంసించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, రమణారెడ్డి, ఆదినారాయణ, మధు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు