కంటి వెలుగుకు స్పందన
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి చక్కని స్పందన లభిస్తోంది. గురువారం జిలావ్యాప్తంగా కంటి వెలుగు వైద్యశిబిరాలను ప్రారంభించారు.
తొలిరోజు జిల్లావ్యాప్తంగా 6,062 మందికి పరీక్షలు
మహబూబ్నగర్ : నేత్ర పరీక్ష చేస్తున్న వైద్య సిబ్బంది
పాలమూరు, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి చక్కని స్పందన లభిస్తోంది. గురువారం జిలావ్యాప్తంగా కంటి వెలుగు వైద్యశిబిరాలను ప్రారంభించారు. మొదటి రోజు 45 వైద్య కేంద్రాలలో 6,062 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అందులో 1,535 మందికి దగ్గరి చూపు కళ్లజోళ్లను అందించారు. మరో 1,071 మందికి దగ్గరి-దూరం, దూరం చూపు కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. 15 రోజుల్లో వారి ఇంటికే కళ్లజోళ్లను పంపించనున్నారు. మొదటి రోజు నిర్వహించిన కంటివెలుగులో అత్యధికంగా మహబూబ్నగర్ పట్టణంలోని పాత పాలమూరు 23వ వార్డులో 241 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అతి తక్కువగా మిడ్జిల్ మండలంలోని అయ్యావారిపల్లిలో 58 మందికి కంటి పరీక్షలు చేశారు. హన్వాడ మండలంలోని టంకర గ్రామంలో అత్యధికంగా కళ్లజోళ్లను ఇచ్చారు. ఇక్కడ 171 మందికి కంటి పరీక్షలు చేయగా 108 మందికి దగ్గరి చూపు కంటి అద్దాలు పంపిణీ చేశారు. తొలిరోజు అన్ని కంటి వెలుగు వైద్యశిబిరాల్లో ప్రజల నుంచి స్పందన లభించిందని డీఎంహెచ్వో డా.కృష్ణ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Hanuma Vihari: అలా చేస్తే నా కెరీర్లో రిస్క్లో పడుతుందని ఆయన చెప్పాడు: హనుమ విహరి
-
Movies News
Social Look: హల్దీ వేడుకలో పూజాహెగ్డే.. సమంత ‘లైట్’ పోస్ట్!
-
India News
Loan Apps: 138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ యాప్లపై కేంద్రం కొరడా!
-
Politics News
KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
-
Movies News
Thaman: నెగెటివిటీపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్