చేర్పులే ఎక్కువ..
వనపర్తి జిల్లాలోని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్త ఓటర్ల నమోదులో భాగంగా చేర్పులే ఎక్కువగా ఉన్నాయి.
నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు 9500
న్యూస్టుడే, వనపర్తి
వనపర్తి జిల్లాలోని ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్త ఓటర్ల నమోదులో భాగంగా చేర్పులే ఎక్కువగా ఉన్నాయి. వనపర్తి జిల్లాగా ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో ఏడు మండలాలతో శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది. మిగిలిన ఏడు మండలాల్లో మూడు కొల్లాపూరు నియోజకవర్గం, రెండు దేవరకద్ర, మరో రెండు మక్తల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. జిల్లాలో అత్యంత పెద్ద నియోజకవర్గంగా వనపర్తి గుర్తింపు పొందింది. ప్రత్యేక ఓటరు నమోదు, జాబితా సవరణ ప్రక్రియ ముగిశాక నియోజకవర్గంలో తుది జాబితాలు ప్రకటించారు. దీని ప్రకారం మొత్తం 2,46,511 ఓటర్లు ఉన్నారు.
తొలగింపులు 1,168 మాత్రమే..
నియోజకవర్గంలో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన శిబిరాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాల కారణంగా మొత్తం 10,668 మంది ఓటర్లుగా చేరారు. మృతులు, ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళ్లినవారు, నియోజకవర్గం నుంచి బదిలీ అయినవారు, ఓటర్లుగా వేరే ప్రాంతాల్లో పేర్లు నమోదుచేసుకున్న వారితో కలిపి మొత్తం 1168 ఓట్లను తొలగించారు. ఓటరు కార్డుకు ఆధార్ను అనుసంధానం చేశాక తుది జాబితా ప్రకటించారు. తుది జాబితా కన్నా ముందు ముసాయిదా జాబితాలో 2,37,011 మంది ఓటర్లుగా ఉన్నారు. అనంతరం మార్పులు చేర్పులతో 9500 ఓట్లు పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్