ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ షురూ!
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెలువడటంతో ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
నేడు సీనియారిటీ జాబితా ప్రకటించే అవకాశం
ఖాళీల వివరాలు క్రోడీకరిస్తున్న విద్యాశాఖ అధికారులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెలువడటంతో ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్కు అనుగుణంగా ఈ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుండగా.. 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాలపట్టికను రూపొందించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు అంచనాలు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. పండిట్, పీఆర్టీ పోస్టుల అప్గ్రేడేషన్పై సందిగ్ధత నెలకొంది.
విద్యాశాఖ కసరత్తు
ఉపాధ్యాయుల బదిలీలను జిల్లాలో 2018లో చేపట్టారు. ఇప్పుడు విభాగాల వారీగా జాబితాలను జిల్లా విద్యాశాఖ తాత్కాలికంగా సిద్ధం చేసింది. ఒకే పాఠశాలలో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వారితో పాటు పదవీ విరమణకు మూడేళ్లలోపు సీనియారిటీ ఉన్నవారి వివరాలను సేకరించింది. మొత్తం మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, లాంగ్ స్టాండింగ్లో ఉన్నవారు, ఖాళీల వివరాలను విద్యాశాఖ బదిలీల కోసం వెబ్సైట్లో పొందుపరిచింది. 2015లో పదోన్నతులు కల్పించింది. దాదాపు ఏడేళ్ల అనంతరం తిరిగి ఈ ప్రక్రియ నిర్వహిస్తుండటంతో విభాగాల వారీగా సీనియారిటీ జాబితా రూపొందించే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2 జాబితాను ఆర్జేడీకి పంపించనున్నారు. ఎస్జీటీలు, పండిట్లు, స్కూల్ అసిసెంట్ల పదోన్నతుల వివరాలను సిద్ధంచేస్తున్నారు. జాబితాలు పూర్తికాగానే వాటిపై అభ్యంతరాలను స్వీకరించి చేర్పులు, మార్పులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్ పద్ధతిలో జరిగే పీజీహెచ్ఎం గ్రేడ్-2 బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లకు పీజీ హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. అనంతరం ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు, ఎస్టీజీల ఖాళీలు ఏర్పడనున్నాయి. బదిలీల్లో పండిట్లు, పీఈటీలకు అవకాశమున్నా పదోన్నతుల విషయంలో వారిలో సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే టీచర్ వెబ్సైట్(హెచ్ఆర్ఎంఎస్)లో పొందుపర్చిన వివరాల ఆధారంగా సీనియారిటీ జాబితాలను తయారు చేస్తున్నారు.
* బదిలీలు, పదోన్నతులకు సీనియారిటీ జాబితాల రూపకల్పనలో దీర్ఘకాలంగా ఒకే స్థానంలో ఉన్న ప్రధానోపాధ్యాయులతో పాటు పదోన్నతులకు అర్హుల వివరాలను సేకరించారు. ప్రధానోపాధ్యాయుల్లో బదిలీలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు కొంత దూరంలోని పాఠశాలలకు బదిలీ అయ్యే అవకాశముండటంతో ఎవరికి వారే లెక్కలు వేసుకోవడం ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2 పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. ఇన్ఛార్జులతో వాటిని నెట్టుకురావడంతో ఉపాధ్యాయులకు పనిభారంతో పాటు పర్యవేక్షణకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. బదిలీలు, పదోన్నతులతో ఈ సమస్య చాలా మేరకు తీరనుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో పాఠశాలల్లో 105, స్థానిక సంస్థల యాజమాన్యంలోని బడుల్లో 380 కలిపి 485 ఖాళీలను గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM