నల్లమలలో మార్గదర్శకులు
కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు, వింతలు తెలుసుకోవాలనే ఉత్సుకత పర్యాటకుల్లో ఉంటుంది. దీని కోసం పక్కనున్న వారినో, అంతర్జాలం సాయంతోనో అందుబాటులో ఉన్న కొంత సమాచారం తెలుసుకుంటాం.
పర్యాటకులకు ఏటీఆర్ విశేషాలు వివరిస్తూ చెంచు యువత ఉపాధి
నేచర్ గైడ్లు చెంచుపెంట యువత
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు, వింతలు తెలుసుకోవాలనే ఉత్సుకత పర్యాటకుల్లో ఉంటుంది. దీని కోసం పక్కనున్న వారినో, అంతర్జాలం సాయంతోనో అందుబాటులో ఉన్న కొంత సమాచారం తెలుసుకుంటాం. అయినా ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. అదే స్థానికంగా ఏళ్ల తరబడి నివసిస్తున్న వారు అందుబాటులో ఉంటే అన్ని విశేషాలను తెలుసుకునే వీలుంటుంది. దశాబ్దాల తరబడి అడవిలోనే ఉంటున్న తమ పూర్వీకుల నుంచి ఎన్నో అనుభవాలు, విశేషాలను తెలుసుకొని కొన్నేళ్ల నుంచి జీవనం సాగిస్తున్న చెంచు యువకులే అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంలో (ఏటీఆర్) సఫారీ వాహనాలకు నేచర్గైడ్లుగా వ్యవహరిస్తూ ఉపాధి పొందుతున్నారు. సందర్శకులకు పక్షులు, జంతువులు, కీటకాల పేర్లతో పాటు వివిధ మొక్కలు, చెట్ల పేర్లు వాటి ఉపయోగాలు, అక్కడి వాతావరణం, స్థానిక తెగల జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులు అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి సాయపడుతూ దారి చూపిస్తుంటారు. అటవీ సందర్శన సమయంలో వన్య మృగాల దాడి నుంచి రక్షణగా తోడుంటున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు, యువకులు, స్నేహితులు ఇలా ఎవరైనా ఏటీఆర్ను సందర్శించాలనుకునే వారికి అమ్రాబాద్, లింగాల, బల్మూరు మండలాల్లోని వెంకటేశ్వర్ల బావి, అప్పాపూర్, పెట్రాల్ చేన్, చెంచుగూడెం, బిల్లకల్, పదర చెంచుపెంటలకు చెందిన యువకులు సఫారీ వాహనాల్లో నేచర్ గైడ్లుగా వ్యవహరిస్తూ పర్యాటకులు పూర్తిస్థాయిలో ప్రకృతిని ఆస్వాదించేలా సాయపడుతున్నారు.
చెట్ల ఉపయోగాలు వివరిస్తాం..
- సి.ఆంజనేయులు, పదర
మాది అమ్రాబాద్ మండలం పదర. ఇంటర్ వరకు చదివాను. అటవీశాఖలో శిక్షణ తీసుకుని నేచర్గైడ్గా మారాను. ఇక్కడి అభయారణ్యానికి వచ్చే పర్యాటకులకు అడవిలోని వివిధ మొక్కలు, చెట్ల పేర్లు వాటి ఉపయోగాలు వివరిస్తాం. విద్యార్థుల్లో ఆసక్తి మెండు. వారికి వివిధ జంతువులు, పక్షులు, కీటకాల పేర్లు, ఇక్కడి వాతావరణం గురించి క్షుణ్నంగా చెబుతాం.
ట్రెక్కింగ్లో సాయంగా..
- ఎన్.గణేశ్, చెంచుగూడెం (బల్మూరు)
మాది బల్మూరు మండలం చెంచుగూడెం. పదో తరగతి పూర్తి చేసాను. అమ్రాబాద్ పులుల అభయారణ్యం సందర్శనకు వచ్చే వారికి గైడ్గా ట్రెక్కింగ్లో సాయం చేస్తా.. అడవిలో పర్యటించేటపుడు పర్యాటకులు పాటించాల్సిన నియమాలు వివరిస్తూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ట్రెక్కింగ్ విజయంతంగా పూర్తిచేసేలా బాధ్యత తీసుకుంటాం.
ప్రకృతిని ఆస్వాదించేలా..
- పరశురామ్, వెంకటేశ్వర్ల బావి గ్రామం (అమ్రాబాద్)
ఏటీఆర్లో సఫారీ వాహనాలకు నేచర్ గైడ్లుగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి చెంచుపెంటల యువకులకు అడవిలోని పరిస్థితులపై అవగాహన ఉంది. మా పూర్వీకుల నుంచి తెలుసుకున్న ఎన్నో విశేషాలను పర్యాటకులకు ఆసక్తిగా వివరిస్తున్నా. అటవీశాఖ అధికారుల ప్రత్యేక శిక్షణ ఆత్మవిశ్వాసం నింపింది. పర్యాటకులు ట్రెక్కింగ్ అనంతరం దృశ్య కేంద్రం వద్ద ప్రకృతిని పూర్తిస్థాయిలో ఆస్వాదించే వరకు అన్ని విధాల సాయపడతాం.
వారికే పూర్తి అవగాహన ఉంటుందని..
- శ్వేత, ప్రజా సంబంధాల అధికారిణి, అమ్రాబాద్ పులుల అభయారణ్యం
ఏటీఆర్లో గతంలో రెండు సఫారీ వాహలుండగా మరో అయిదు కొత్త వాటిని అందుబాటులోకి తెచ్చాం. ఇందులో గైడ్లుగా అడవిపై పూర్తి అవగాహన ఉండే స్థానిక చెంచు యువతకే అవకాశం కల్పించాం. పదో తరగతి అర్హతతో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి వీరికి వివిధ జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ఆంగ్ల పేర్లు కూడా నేర్పించాం. పర్యాటకులతో ఎలా మాట్లాడాలి, సందర్శకులు అడవిలో ఎలాంటి నియమాలు పాటించాలో కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. దీంతో వీళ్లు పర్యాటకులకి అన్ని విధాల సహకారం అందిస్తారు. పర్యాటకులే వీరికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ