తపాలా పథకాలపై విస్తృత ప్రచారం
తపాలా శాఖ అందిస్తున్న సంక్షేమ, పొదుపు పథకాల ప్రచారానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈనెల 28 నుంచి 31 వరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించనున్నారు.
నాగర్కర్నూల్ : తపాలాకార్యాలయం వద్ద పథకాలపై వివరిస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, కొల్లాపూర్ గ్రామీణం: తపాలా శాఖ అందిస్తున్న సంక్షేమ, పొదుపు పథకాల ప్రచారానికి అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈనెల 28 నుంచి 31 వరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించనున్నారు. తపాలా పొదుపు పథకాల వడ్డీరేట్లు పెరిగినట్లు వనపర్తి డివిజన్ ఇన్ఛార్జి, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా నాగర్కర్నూల్ సబ్డివిజన్ అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో పొదుపు, బీమా పథకాలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సేవింగ్ ఖాతా..: గ్రామీణ ప్రజలు తమ రోజువారీ సంపాదన పొదుపు చేసుకునేందుకు ఈ ఖాతా ఉపయోగపడనుంది. బ్యాంకుల కంటే 4 శాతం అధికంగా వడ్డీ చెల్లించనున్నారు. ఉచిత ఏటీఎం సేవలు, చెక్బుక్, ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంది. ఉమ్మడి జిల్లాలో 2 లక్షలకు పైగా పొదుపు ఖాతాలున్నాయి. పాన్, ఆధార్కార్డుతోపాటు రెండు ఫొటోలు, రూ.500 సమీపంలోని పోస్టాపీసులో చెల్లిస్తే ఖాతా తెరిచి ఖాతాదారుకు పాసుపుస్తకం అందజేస్తారు.
సుకన్య సమృద్ధి ఖాతా..: ఆడపిల్లలకు ఆర్థిక చేయూతనందించే ఈ పథకంలో రూ.250 చెల్లించి ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్లలోపు ఆడపిల్లలకు ఈ పథకం వరం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ప్రస్తుతం 7.6 శాతం చక్రవడ్డీ కొనసాగుతోంది. ఖాతా తెరిచిన నాటి నుంచి 15 ఏళ్ల వరకు పొదుపు చేయవచ్చు. ఖాతా తెరిచిన నాటి నుంచి 21 ఏళ్ల తర్వాత సొమ్ము చెల్లిస్తారు. అమ్మాయి వయస్సు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం, చదువులకు అంతకుముందు సంవత్సరం వరకు జమ అయిన సొమ్ములో 50 శాతం సొమ్ము వెనక్కి తీసుకోవవచ్చు. సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు ఉంది.
టైం డిపాజిట్.. : ఈ ఖాతాలో కనీసం రూ.వెయ్యి నుంచి ఎంతైనా జమ చేయవచ్చు. కాలపరిమితి 1, 2, 3, 5 ఏళ్లు. వడ్డీ ఏటా చెల్లిస్తారు. సంవత్సరానికి 6.6 శాతం, రెండేళ్లకు 6.8 శాతం, 3 ఏళ్లకు 6.9 శాతం, 5 ఏళ్లకు 7 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. పెద్దమొత్తంలో జమచేసేందుకు ఈ ఖాతా అనువుగా ఉంటుంది.
మంత్లీ ఇన్కం స్కీమ్.. : ఈ ఖాతా ద్వారా లబ్ధిదారుడు రూ.4.50 లక్షల వరకు, జాయింట్గా రూ.9 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఇందుకు నెలనెలా 7.1 శాతంతో వడ్డీ పొందే వీలుంది. ఖాతా కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది.
మెరుగైన పాలసీలు.. : ఇతర బీమా పథకాలకంటే మెరుగ్గా తపాలా జీవిత బీమా ఉంటుంది. ఇందులో కనీసం రూ.20 వేలు నుంచి రూ. 50 లక్షల వరకు బీమా పాలసీలు పొందవచ్చు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ అందుతుంది. 19 నుంచి 55 ఏళ్లలోపు వారు ఇందులో చేరవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఈ బీమాలో చేరవచ్చు. పాలసీ ప్రారంభించిన 3 ఏళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంది. పాలసీదారుడు ఆకస్మాత్తుగా మరణిస్తే పాలసీ సొమ్ము, బోనస్తో కల్పి నామినీకి చెల్లిస్తారు.
గ్రామీణ బీమా ఆకర్షణీయం.. : తపాలా జీవిత, గ్రామీణ బీమాకు ఆదరణ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారందరికీ బీమా వర్తిస్తుంది. ఇందులో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు విలువగల పాలసీలు పొందవచ్చు. నిరక్షరాస్యులు 19 నుంచి 45 ఏళ్లలోపు వారు, అక్షరాస్యులు 55 ఏళ్ల వరకు బీమా పథకాలు పొందవచ్చు. పాలసీలో చేరిననాటి నుంచి 3 ఏళ్ల తర్వాత రుణం, ఆకస్మాత్తుగా మరణిస్తే పాలసీ విలువ బోనస్తోకలిపి నామినీకి చెల్లిస్తారు. దేశంలో ఎక్కడైనా ప్రీమియం చెల్లింపు చేసుకోవచ్చు. అంతర్జాలంలో కూడా చెల్లించే అవకాశం ఉంది.
వెంకటేశ్వర్లు, వనపర్తి తపాలా డివిజన్ పర్యవేక్షకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం స్వాధీనం, కేసు నమోదు
[ 28-03-2024]
మండలంలోని మాన్ దొడ్డి గ్రామం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
పూర్తయిన మగ్గాల సర్వే
[ 28-03-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేపడుతున్న క్లస్టర్ పథకం మగ్గాల పరిశీలన గురువారంతో పూర్తయ్యింది. -
దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
[ 28-03-2024]
రాజోలి గ్రామంలో వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
[ 28-03-2024]
శాంతినగర్ పోలీస్ స్టేషన్లో గురువారం జిల్లా ఎస్పీ రితిరాజ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది బాధితులు వివిధ సమస్యలపై ఆమెకు ఫిర్యాదులు అందజేశారు. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
[ 28-03-2024]
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్
[ 28-03-2024]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
[ 28-03-2024]
జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు. -
అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
[ 28-03-2024]
అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ దేవి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు -
గద్వాల పట్టణంలో భారీ చోరీ
[ 28-03-2024]
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది. -
మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!
[ 28-03-2024]
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
మక్తల్ నుంచి భాజపా ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. -
నాగర్కర్నూల్ స్థానాన్ని గెలిచి కానుకగా ఇస్తాం
[ 28-03-2024]
భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్ సభ్యుడు పి.రాములు అన్నారు. -
డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ కన్ను
[ 28-03-2024]
మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. -
మన్యంకొండలో పూర్ణాహుతి
[ 28-03-2024]
మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో... -
మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
[ 28-03-2024]
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. -
అడుగంటుతున్న వరదాయని
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. -
మహిళా సంఘాలకే ఎక్కువ కేంద్రాలు
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు. -
చిన్నారులకు బాల ఆధార్
[ 28-03-2024]
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. ఇది గుర్తింపుకార్డు మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఇదే ప్రామాణికంగా మారింది. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ... -
పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్చుప్!
[ 28-03-2024]
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అనిశా వలలో తహసీల్దార్
[ 28-03-2024]
ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ ఘటన గుండుమాల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. -
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 28-03-2024]
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్ అధికారి బాలకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం