logo

మెరుగైన సేవలు అందించేందుకు కృషి

మెరుగైన సేవలను అందించడానికి కృషి చేయాలని జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ పోలీసు శాఖ సిబ్బందికి సూచించారు.

Published : 27 Jan 2023 04:43 IST

జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌

సెల్యూట్‌ చేస్తున్న డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌. చిత్రంలో ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ రాములు

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : మెరుగైన సేవలను అందించడానికి కృషి చేయాలని జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ పోలీసు శాఖ సిబ్బందికి సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని డీఐజీ కార్యాలయం వద్ద గురువారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కుటుంబంతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. అనేక రకాల సమస్యలతో స్టేషన్లకు వచ్చేవారికి సత్వరమే తగిన న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని