సమష్టి కృషి, సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి
అన్ని శాఖల అధికారుల సమష్టి కృషి, సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తేనే జిల్లా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు.
కందనూలు, న్యూస్టుడే : అన్ని శాఖల అధికారుల సమష్టి కృషి, సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తేనే జిల్లా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ విప్ గువ్వల బాల్రాజు, జడ్పీ ఛైర్పర్సన్ శాంతకుమారి, ఎస్పీ మనోహర్ అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా జిల్లాలోని చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందించామన్నారు. మిగిలిన నియోజకవర్గాల పరిధిలోనూ 301 లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 1708 మంది లబ్ధిదారులకు రూ. 169.09 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్లో జిల్లాలో 49,336 ఖాతాలు పెండింగ్లో ఉండగా రెవెన్యూ అధికారులు 41,432 ఖాతాల సమస్యలు పరిష్కరించి డీజిటల్ సంతకం చేసినట్లు తెలిపారు. రైతు బంధు పథకంలో 2 లక్షల 88 వేల మంది రైతులకు రూ. 3.195 కోట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. బిజినేపల్లి మండలంలో మార్కండేయ లిఫ్ట్ పనులకు రూ. 76.95 కోట్లు కేటాయించామని 7,310 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ప్రస్తుతం భూసేకరణ దశలో ఉందన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 35,600 విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు మెరుగయ్యాయన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నాలుగేళ్లుగా 197.40 టీఎంసీల నీళ్లు ఆయకట్టుకు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఏడాదిలో 22.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు సూచించారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి రూ. 10 కోట్లతో ఉమామహేశ్వరం దేవస్థానం వద్ద అతిథి గృహాలు, రెస్టారెంట్లు నిర్మిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుశాఖ పకడ్బందీగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర పోలీసుశాఖ 14 వర్టికల్స్ అమలు చేయగా 5 వర్టికల్స్ విభాగంలో జిల్లా పోలీసు సిబ్బంది ముందున్నారని వివరించారు. 150 కంటే తక్కువ కేసులు నమోదైన జిల్లాలోని ఉప్పునుంతల ఠాణా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, అమ్రాబాద్ 5వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజలు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపాడాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మనూచౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ హనుమంతురావు, పురపాలక శాఖ ఛైర్పర్సన్ కల్పన తదితరులు పాల్గొన్నారు.
జెండా వందనం చేస్తున్న కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మనోహర్.. జిల్లా ప్రగతిని వివరిస్తున్న కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని