త్యాగధనుల కృషి చిరస్మరణీయం
ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా నేడు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుగుకుంటున్నామని, వారి కృషి చిరస్మరణీయమని కలెక్టర్ క్రాంతి అన్నారు.
కనిపించని సందడి
జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్ క్రాంతి, ఎస్పీ రంజన్ రతన్కుమార్ చిత్రంలో జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా నేడు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుగుకుంటున్నామని, వారి కృషి చిరస్మరణీయమని కలెక్టర్ క్రాంతి అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి 9.45 నిమిషాల వరకు నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకం ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలభవన్తోపాటు మరో రెండు పాఠశాలలకు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం రెవెన్యూ, పోలీసుశాఖ మధ్య క్రికెట్ పోటీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్, జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, డా. అబ్రహం, ఎస్పీ రంజన్రతన్కుమార్లు హాజరయ్యారు.
సంబరంగా నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవాన్ని రెవెన్యూశాఖ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా మమ అనిపించడంపై జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించగా గతేడాది కొవిడ్ కారణంగా నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఈ ఏడాది ఎలాంటి పరిమితులు లేనప్పటికి పరేడ్ గ్రౌండ్లో ఏ మాత్రం సందడి కనిపించలేదు. పరేడ్ గ్రౌండ్లో జిల్లాలో వివిధ శాఖల్లో పని తీరు కనబరిచిన ఉద్యోగులు, జిల్లా అధికారులు, పోలీసులు, కొంత మంది విద్యార్థులు తప్ప రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులెవరూ హాజరకాలేదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను పట్టించుకోలేదని ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు రెవెన్యూ అధికారులతో వాదనకు దిగారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. పట్టణంలోని ఓ పాఠశాల నుంచి ప్రదర్శన నిమిత్తం వచ్చిన 30 విద్యార్థుల ప్రదర్శన పూర్తి కాకుండానే మధ్యలోనే నిలిపివేడంతో నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లకు అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో