కనులపండువగా అమ్మవారి నిజరూప దర్శనం
అయిదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ సన్నిధిలో మాఘమాసం వసంత పంచమి పురస్కరించుకుని గురువారం భక్తులకు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగించారు.
పంచామృతాభిషేకం చేస్తున్న దృశ్యం
అలంపూర్, న్యూస్టుడే : అయిదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ సన్నిధిలో మాఘమాసం వసంత పంచమి పురస్కరించుకుని గురువారం భక్తులకు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగించారు. జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జోగులాంబ జాతర పేరిట పట్టణంలో వివిధ వేషాధారణలు, వాయిద్యాల మధ్య భక్తజనం భారీగా కలశాలతో ఆలయాలకు తరలి వచ్చారు. వీటిని జోగులాంబ అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి చీరలు, ఒడి బియ్యం, నిమ్మకాయలమాల సమర్పించారు. అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ ఆలయంలోని కుంకుమార్చన మండపంలో సహస్ర కలశాభిషేకాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యగశాలలో అవాహిత దేవతమూర్తులకు ఉదయం 9 గంటలలోపు పూర్ణాహుతి చేశారు. వేల సంఖ్యలో భక్తుల రాకతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మధ్య మధ్యలో ప్రముఖుల తాకిడి ఉండటంతో భక్తులు కొంత మేరకు ఇబ్బంది పడ్డారు. కలశాలను అమ్మవారికి సమర్పించేందుకు దాదాపు గంటకుపైగా క్యూలైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసి సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత మళ్లీ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.
కల్యాణం జరిపిస్తున్న అర్చకులు
వేడుకగా ఆదిదంపతుల కల్యాణం : వసంత పంచమిని పురస్కరించుకుని గురువారం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని జోగులాంబ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాలకు శాంతి కల్యాణోత్సవం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్