పరిస్థితులపై పూర్తి అవగాహన : ఎస్పీ
మహబూబ్నగర్ జిల్లా తనకు కొత్త కాదని, ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉందని నూతన ఎస్పీ కె.నరసింహ అన్నారు. గురువారం సాయంత్రం పోలీసు శాఖ కార్యాలయంలో ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు.
ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న కె.నరసింహ
మహబూబ్నగర్ నేరవిభాగం, న్యూస్టుడే : మహబూబ్నగర్ జిల్లా తనకు కొత్త కాదని, ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉందని నూతన ఎస్పీ కె.నరసింహ అన్నారు. గురువారం సాయంత్రం పోలీసు శాఖ కార్యాలయంలో ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2011లో ఉమ్మడి జిల్లాలో ఏడాది పాటు డీఎస్పీ ప్రొబేషనరీ చేశానన్నారు. ఆ సమయంలో అనేక ప్రాంతాలను తిరిగినట్లు వివరించారు. నేరాలను అదుపు చేయడానికి సిబ్బందితో కలిసి కృషి చేస్తానన్నారు. నూతన ఎస్పీకి బదిలీపై వెళ్తున్న ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు, తదితరులు అభినందనలు తెలిపారు.
* ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ స్వస్థలం నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని కొండాపురం. 2010లో గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నారు. తొలుత ఆర్మూర్లో డీఎస్పీగా పనిచేశారు. తర్వాత గుంటూర్, కామారెడ్డి రూరల్ డీఎస్పీగా 2017 వరకు పనిచేశారు. అనంతరం అదే ఏడాది అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. సైబరాబాద్, వరంగల్ సెంట్రల్ జోన్ అదనపు ఎస్పీగా పనిచేశారు. మూడున్నరేళ్ల నుంచి గవర్నర్ వద్ద ఏడీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా మహబూబ్నగర్ జిల్లాకు నియమించింది.
బదిలీ ఎస్పీకి వీడ్కోలు..
మహబూబ్నగర్ నేరవిభాగం : మహబూబ్నగర్ ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఆర్.వెంకటేశ్వర్లుకు జిల్లా పోలీసు అధికారులు వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా కె.నరసింహ విధుల్లో చేరిన తర్వాత ఆయన రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, ఆదినారాయణ, శ్రీనివాసులు రమణారెడ్డి, సీఐలు, ఎస్సైలు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది వీడ్కోలు చెప్పారు. ఆర్.వెంకటేశవర్లు 2021 ఏప్రిల్ 6వ తేదీన జిల్లా ఎస్పీగా వచ్చారు. ఇన్నాళ్లు తనకు సహకారం అందించిన పోలీసు సిబ్బందికి, జిల్లా అధికారులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్