వనపర్తి కలెక్టర్గా తేజస్ నంద్లాల్ పవర్
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా జి.రవినాయక్ నియమితులయ్యారు. జగిత్యాల కలెక్టర్గా ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నారు.
మహబూబ్నగర్కు రవినాయక్
ఇద్దరు కలెక్టర్ల విద్యాభాస్యం సైనిక్ పాఠశాలల్లోనే
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా జి.రవినాయక్ నియమితులయ్యారు. జగిత్యాల కలెక్టర్గా ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి రానున్నారు. మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావ్ సూర్యాపేట జిల్లాకు బదిలీ అయ్యారు. మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా ఉన్న తేజస్ నంద్లాల్ పవర్ వనపర్తి కలెక్టర్గా పదోన్నతి పొందారు. వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా కుమురం భీం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబ్నగర్ కలెక్టర్గా రానున్న రవినాయక్ 2015 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆయన విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభాస్యం చేశారు. వరంగల్లోని ఆర్ఈసీలో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత గ్రూపు-1 అధికారిగా బాధ్యతలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. 2015లో కన్ఫడ్ ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం జగిత్యాల కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై వస్తున్నారు.
* వనపర్తి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్న తేజస్ నంద్లాల్ పవర్ 2018 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. కామారెడ్డి జిల్లాలో ఏడాది శిక్షణ నిమిత్తం విధులు నిర్వహించారు. అనంతరం 2020లో మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా(స్థానిక సంస్థల) మొదటిసారిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ఆయనకు వనపర్తి జిల్లాకు పదోన్నతిపై కలెక్టర్గా పంపించారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా. అక్కడే సైనిక్ పాఠశాలలో విద్యాభాస్యం పూర్తి చేశారు. నాసిక్లోని సందీప్ ఫౌండేషన్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ రాసి ఐఏఎస్కు ఎంపియ్యారు.
యాస్మిన్ బాషా మూడేళ్ల సేవలు..
కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాకు రెండో కలెక్టర్గా షేక్ యాస్మిన్ బాషా బాధ్యతలు చేపట్టారు. సిరిసిల్ల అదనపు కలెక్టర్గా ఉన్న ఆమె 2020 ఫిబ్రవరిలో వనపర్తి కలెక్టర్గా వచ్చారు. 2003లో గ్రూపు-1 పరీక్ష రాశారు. 2007లో ఫలితాలు రాగా ఆమెను శిక్షణ కోసం మెదక్ జిల్లాలోని హత్నూరా ఎంపీడీవో కార్యాలయానికి పంపించారు. అక్కడ ఏడాది పని చేసిన తర్వాత డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ శిక్షణ కూడా మెదక్ జిల్లాలోనే జరిగింది. 2011లో ఫారెస్టు సెటిల్మెంట్ అధికారిగా పూర్వ మహబూబ్నగర్కు వచ్చారు. అనంతరం ఇదే జిల్లాలో డీపీవోగా, జడ్పీ డిప్యూటీ సీఈవోగా, మీ సేవా సమన్వయకర్తగా, డీఆర్వోగా విధులు నిర్వహించారు. 2015 కన్ఫడ్ ఐఏఎస్గా పదోన్నతి పొందారు.
పాలమూరులోనే వెంకట్రావుకు ఐఏఎస్గా పదోన్నతి.. : సూర్యాపేటకు బదిలీపై వెళ్లనున్న వెంకట్రావు ఫిబ్రవరి 2020లో మహబూబ్నగర్ కలెక్టర్గా వచ్చారు. అంతకు ముందుకు నారాయణపేట కలెక్టర్గా ఉన్నారు. 2018లో మహబూబ్నగర్కు సంయుక్త కలెక్టర్గా వచ్చిన ఆయన ఇక్కడే ఐఏఎస్గా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు బాధ్యతలు చేపట్టారు. అదనపు సంయుక్త కలెక్టర్గా, యాదాద్రి డీఆర్డీవోగా విధులు నిర్వహించారు. జిల్లాల పునర్విభజన ఆయన తర్వాత నారాయణపేట జిల్లాకు మొదటి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లాకు రొనాల్డ్రోస్ తర్వాత రెండో కలెక్టర్గా వెంకట్రావు వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో