బడి స్థలాల పరిరక్షణపై సర్కారు దృష్టి
భూములకు మార్కెట్లో భారీగా డిమాండు పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో గజం ధర కనీసం 5 నుంచి 25 వేల రూపాయల దాకా పలుకుతోంది.
ఆక్రమణలకు గురికాకుండా వివరాలు సేకరిస్తున్న వైనం
అచ్చంపేట, న్యూస్టుడే
అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలం
భూములకు మార్కెట్లో భారీగా డిమాండు పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో గజం ధర కనీసం 5 నుంచి 25 వేల రూపాయల దాకా పలుకుతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు కొందరు అక్రమార్కులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం పాఠశాలలకు దాతలు భూములను ఉచితంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం వాటిల్లో భవనాలు నిర్మించి, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే అవకాశం కల్పించింది. పాఠశాలల ఆవరణల్లో కానీ, వాటికి అనుబంధంగా కానీ క్రీడా మైదానాలు, ఖాళీ స్థలాలున్నాయి. కొన్నిచోట్ల వాటిని సొంతం చేసుకోవాలని కొందరు యత్నిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తుండడంతో ప్రభుత్వం పాఠశాల ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించింది. విద్యాలయాలకు భూదానం చేసిన వారి వారసులు కూడా ఆయా ఖాళీ స్థలాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్కూళ్ల స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు పక్కాగా వివరాలు సేకరించే కార్యక్రమాన్ని సర్కారు చేపట్టింది. పాఠశాలల వారీగా మొత్తం భూవిస్తీర్ణం, తరగతి గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టిన స్థల విస్తీర్ణంతో పాటు మిగులు భూమి వివరాలను కూడా చదరపు అడుగుల్లో సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే డీఈవోలు ఆయా వివరాలు సేకరించాలని ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు సూచనలు చేశారు. స్కూళ్ల వారీగా ఖాళీగా ఉన్న స్థలాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు.
పూర్తికావస్తున్న ప్రక్రియ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ స్థలాల వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు విద్యాశాఖకు చేరిన ఆయా బడుల స్థలాలకు సంబంధించిన వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని 14 మండలాల్లో వంద శాతం నమోదు ప్రక్రియ పూర్తయింది. ఎంఈవోల పర్యవేక్షణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలు, డీఈవోల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని అమ్రాబాద్, బల్మూరు, బిజినేపల్లి, చారకొండ, కల్వకుర్తి, కోడేరు, కొల్లాపూరు, పదర, పెంట్లవెల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట, ఉప్పునుంతల, ఊర్కొండ, వంగూరు మండలాలు ఇప్పటికే వంద శాతం పాఠశాలల్లో ఖాళీ స్థలాల వివరాలను సేకరించి అధికారులకు పంపారు.
* అచ్చంపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 90 వేల చదరపు అడుగుల స్థలం ఉండగా ఇప్పటివరకు 8,700 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టగా, ఇంకా 81,300 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది.
* మండలంలోని గుంపన్పల్లి ప్రాథమిక పాఠశాలలో 44,740 అదరపు అడుగుల స్థలం, చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 43,056, నడింపల్లి ప్రాథమిక బడిలో 30,756, అచ్చంపేట మండల పరిషత్తు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో 28,710, పీర్లబాయితండా ప్రాథమిక బడిలో 12,662, బ్రాహ్మణపల్లి బడిలో 12,109 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. చాలా పాఠశాలల్లో అధిక మొత్తంలో ఖాళీ స్థలాలు ఉండడంతో వాటి పరిరక్షణపై అధికారులు దృష్టి పెట్టి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.
అట్టడుగున పెద్దకొత్తపల్లి : ఖాళీ స్థలాల వివరాలను సేకరించడంలో పెద్దకొత్తపల్లి మండలం అట్టడుగున ఉంది. మండలంలో 50 పాఠశాలలుండగా 21 బడుల వివరాల సేకరణ పూర్తికాగా, మరో 29 మండలాలు పెండింగులో ఉన్నాయి. ఇప్పటివరకు 42 శాతం మాత్రమే భూముల వివరాల సేకరణ పూర్తయింది. ఆ తరువాత అచ్చంపేట మండలంలో 62.9, వెల్దండ 98.25, నాగర్కర్నూలు 91.53, లింగాల 96.3, తాడూరు మండలంలో 97.3 శాతం స్థలాల సేకరణ పూర్తి చేశారు.
సత్వరమే పూర్తికి చర్యలు
గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల స్థలాల వివరాలను సేకరించే ప్రక్రియను వెంటనే పూర్తిచేసేందుకు ఎంఈవోలు, హెచ్ఎంలు శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పటివరకు 92.73 శాతం వివరాల సేకరణ పూర్తయింది. ఇంకా కేవలం 7.27 శాతమే సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 మండలాల ఎంఈవోలు, హెచ్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వంద శాతం పాఠశాలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. మిగిలిన బడుల హెచ్ఎంలు వెంటనే వివరాలు పంపేలా శ్రద్ధ తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలయ మండపానికి భూమి పూజ
[ 24-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించేందుకు శ్రీ భ్రమరాంబిక అడిగేశ్వర స్వామి ఆలయ మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు